సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా గుంటూరు కారం అనే ఫ్యామిలీ ప్లేస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో శ్రీ లీల , మీనాక్షి చౌదరి ... మహేష్ బాబు కు జోడి గా నటించగా ... మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. చిన బాబు , సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించగా ... సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ లో మహేష్ బాబు కు తండ్రి పాత్రలో జయరామ్ నటించగా ... తల్లి పాత్రలో రమ్య కృష్ణ నటించింది.

ఇకపోతే ప్రకాష్ రాజ్ , రావు రమేష్ , రాహుల్ రవీంద్రన్ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు కాస్త నెగటివ్ టాక్ ను తెచ్చుకుంది. కానీ ఈ సినిమా కాస్త పుంజుకొని మంచి కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇకపోతే ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పర్వాలేదు అనే స్థాయిలో అలరించిన ఈ సినిమా ఆ తర్వాత "ఓ టి టి" ప్రేక్షకులను కూడా భాగానే అలరించింది.

ఇకపోతే ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే బుల్లి తెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంది. ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను జెమినీ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని ఈ సంవత్సరం ఉగాది కానుకగా బుల్లి తెరపై ప్రసారం చేయనున్నట్లు జెమిని సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. మరి ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: