టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకులలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాలకు కథ రచయిత గాను , మాటల రచయిత గాను పని చేశాడు. వాటితో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఈయన నువ్వే నువ్వే అనే సినిమాతో దర్శకుడుగా కెరియర్ ను ప్రారంభించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం తో దర్శకుడి గా కూడా త్రివిక్రమ్ కు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది. ఇక అప్పటి నుండి ఈయన వరుసగా సినిమాలకు దర్శకత్వం వహిస్తూ వస్తున్నాడు.

అందులో చాలా సినిమాలు అద్భుతమైన విజయాలను సాధించడంతో ప్రస్తుతం ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ దర్శకులలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే త్రివిక్రమ్ తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా రూపొందిన గుంటూరు కారం అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇకపోతే త్రివిక్రమ్మూవీ తర్వాత అల్లు అర్జున్ హీరో గా ఓ భారీ బడ్జెట్ సినిమాను రూపొందించబోతున్నట్లు ప్రకటించాడు.

కాకపోతే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 మూవీ లో హీరో గా నటిస్తూ ఉండడం ... ఆ తర్వాత అట్లీ దర్శకత్వంలో ఓ మూవీ లోను , సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మరో మూవీ లోను నటించే అవకాశం ఉండడంతో అంత లోపు త్రివిక్రమ్ చిన్న హీరోలతో ఒకటి లేదా రెండు చిన్న సినిమాలను పూర్తి చేసి ఆ తర్వాత అల్లు అర్జున్ తో ఓ భారీ సినిమాను తెరకెక్కించాలి అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి త్రివిక్రమ్ , అల్లు అర్జున్ ఫ్రీ అయ్యే లోపు చిన్న సినిమాలకు దర్శకత్వం వహిస్తాడా ..? లేక అతని కోసం వెయిట్ చేసి పెద్ద సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు వస్తాడా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: