
కేవలం కాంబినేషన్ క్రేజీ మీద బిజినెస్ చేసి .. లెక్కలేనంత ఖర్చుతో ప్రమోషన్లు చేసి తీరా దియేటర్ లో కూర్చున్న తర్వాత దర్శకుడు మణిరత్నం చూపించిన తలనొప్పి అంత ఇంతా కాదు .. దళపతి , నాయకుడు , రోజా , బొంబాయి వంటి సినిమాలు తీసింది ఈ దర్శకుడైన అని ఎవరికైనా సందేహం రాకుండా ఉండదు .. భారతీయుడు , జెంటిల్మెన్ , ఒకే ఒక్కడు , ప్రేమికుడు లాంటి గొప్ప సినిమాలు ఇచ్చిన ఇండియన్ స్పిల్ బర్గ్ శంకర్ వరుసగా ఇండియన్ 2 , గేమ్ చేంజర్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ ముందు మర్చిపోలేని డిజాస్టర్లు ఇచ్చారు .. పాటలకు , ఫైట్లకు వందల కోట్లు ఖర్చు పెట్టించిన దానికి తగ్గ అవుట్ పుట్ సగం కూడా రాబట్టుకోలేకపోతున్నారు .
అలాగే మురుగదాస్ ది కూడా ఇదే కథ .. గజిని , తుపాకీ లాంటి గొప్ప సినిమాలు ఇచ్చిన ఇతనేనా సల్మాన్ తో సికందర్ తీసింది అని అనుకోని వాళ్ళు లేరు. అంతకుముందు రజినీకాంత్ పిలిచి దర్బార్ ఇచ్చిన దాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేకపోయారు. ఇప్పుడైనా చివరి ఆశ శివ కార్తికేయన్ మదరాసినే .. ఇలా కోలీవుడ్లో బలమైన ప్రభావం చూపించిన ఇలాంటి గొప్ప దర్శకులు ఇంత ఇలా కింద స్థాయికి దిగజారి పోవడం ఏంటని ఫాన్స్ ఎంతగానో బాధపడుతున్నారు .. అలాగే తమిళ ఇండస్ట్రీకి చెందినప్పటికీ ఇతర ఇండస్ట్రీలో భారీ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ దిగ్గజాలు ఇప్పుడు ఇలాంటి ట్రోలింగ్ కి గురికావడం కొంత బాధాకరం .. వీరు కంబ్యాక్ ఇవ్వటం అనేది వీరి చేతిలోనే ఉంది .. మరి రాబోయే రోజుల్లో అయినా ఈ దర్శకులు మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆశిద్దాం .