
రీసెంట్ టైమ్లో పవన్ కళ్యాణ్ నటించిన `హరిహర వీరమల్లు` మూవీ విషయంలో ఇదే జరిగింది. ఈ సినిమాను స్టార్ట్ చేసింది క్రిష్ జాగర్లమూడి కాగా.. ముగించింది జ్యోతి కృష్ణ. అయితే నిర్మాతలు దర్శకులుగా ఇద్దరు పేర్లను వేస్తున్నారు. కానీ అసలు దర్శకుడు పేరే లేకుండా తెలుగులో విడుదలైన ఏకైక సినిమా ఏదో తెలుసా `శుభకార్యం`.

అయితే మూవీ కంప్లీట్ అయ్యాక డైరెక్టర్ గా తన పేరే వేయాలంటూ రవిరాజా పినిశెట్టి పట్టబట్టారు. సినీ పెద్దలకు ఆయన కంప్లైంట్ కూడా చేయడంతో అప్పట్లో ఈ ఇష్యూ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నిర్మాత అస్సలు దర్శకుడి పేరే లేకుండా శుభకార్యం మూవీని రిలీజ్ చేశారు. ఇటు రవిరాజా పినిశెట్టి, ఇటు అదియమాన్ ఇద్దరికీ క్రెడిట్ దక్కకుండా చేశారు. ఇక డైరెక్టర్ పేరు లేకుండా విడుదలైన శుభకార్యం పెద్దగా ఆడలేదు. ఈ సినిమా, బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మూవీ `నరసింహా నాయుడు` సేమ్ టు సేమ్ ఒకేలా ఉండటంతో ప్రేక్షకులు శుభకార్యం వొంక కూడా చూడలేదు.