- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి చాలా కాలం తర్వాత వ‌రుస సినిమాలు వ‌స్తున్నాయి. వీటిలో ముందుగా గ‌త నాలుగేళ్ల నుంచి షూటింగ్ జ‌రుపుకుంటోన్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా వ‌స్తోంది. ఈ సినిమా త‌ర్వాత రెండు నెల‌ల గ్యాప్ లో ప‌వ‌న్ గ్యాంగ్ స్ట‌ర్ డ్రామా ఓజీ సినిమా కూడా వ‌స్తోంది. ఈ రెండు సినిమాల త‌ర్వాత వ‌చ్చే యేడాది హ‌రీష్ శంక‌ర్ డైరెక్ష‌న్ లో వ‌స్తోన్న ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ సినిమా రిలీజ్ అవుతుంది. ఇక వీర‌మ‌ల్లు సినిమా ట్రైల‌ర్ వ‌చ్చాక ఒక్క సారి గా సినిమా పై హైప్ పెరిగింది. ఇక ఈ సినిమా త‌ర్వాత ప‌వ‌న్ నుంచి రానున్న సెన్షేష‌న‌ల్ ప్రాజెక్ట్ ఓజీ.


ద‌ర్శ‌కుడు సుజిత్ తెర‌కెక్కిస్తోన్న ఈ సినిమా లో ప‌వ‌న్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. ఇక తాజా స‌మాచారం ఏంటంటే ఈ సినిమా ఫ‌స్టాఫ్ వ‌ర‌కు ప‌వ‌న్ చేశార‌ట‌. అందులో కొన్ని మార్పులు కూడా ప‌వ‌న్ సూచించ‌డంతో మేక‌ర్స్ ఆ చిన్న చిన్న మార్పులు చేసే ప‌నిలో బిజీగా ఉన్నార‌ని అంటున్నారు. ఇక ఈ సినిమాకు థ‌మ‌న్ సంగీతం అందిస్తుండ‌గా ... డీవీవీ ఎంట‌ర్టైన్ మెంట్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కు ఏపీలోనూ .. ఇటు నైజాం లోనూ ఏరియాల వారీ గా జ‌రుగుతోన్న ప్రి రిలీజ్ బిజినెస్ అయితే సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: