ఉక్రెయిన్ లో చిక్కుకు పోయిన భారతీయ పౌరులను స్వదేశానికి పంపించడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఉక్రెయిన్ లో ఉన్న భారతీయ విద్యార్థులను ముందస్తుగా సరిహద్దు దేశాలు అయిన రొమేనియా మరియు హంగరీ లకు పంపించారు. అక్కడ నుండి ఇండియాకు పంపాలని ప్లాన్ చేశారు. అనుకున్న విధంగానే ఇప్పుడు అక్కడ నుండి డైరెక్ట్ గా ఇండియా కు రానున్నారు. ఈ తరలింపు కోసం ఇండియా రెండు ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానాలను ఏర్పాటు చేసింది. ఈ రెండు ఎయిర్ ఇండియా విమానాల్లో 470 మంది వరకు వస్తున్నారు. అందులో భాగంగా రొమేనియా రాజధాని అయిన బుకారెస్ట్ నుండి ఢిల్లీ మరియు ముంబై నగరాలకు ఆ రెండు విమానాలు బయలు దేరినట్లు సమాచారం అందుతోంది.
ఇప్పటికే ఒక ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీ కి సురక్షితంగా చేరుకుంది. కాగా మిగిలిన ఇంకొక ఎయిర్ ఇండియా విమానంలో మధ్యాహ్నం ముంబై కు చేరుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి అలా ఉక్రెయిన్ నుండి వచ్చిన ఆయా రాష్ట్రాల విద్యార్థులను ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా వారి ఇంటికి పంపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.