అసెంబ్లీ సమావేశాలు చివరి రోజున జగన్ చేసిన  ప్రకటన ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చంటూ అంటూ అన్నదానిపై రాష్టం అంతటా భిన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. రాజధానిపై అధ్యయనానికి నియమించిన జీఎన్ రావు కమిటీ నివేదికతో రాజధాని అమరావతి ప్రాంతంలో ఒక్కసారిగా అలజడి వాతావరణం నెలకొంది .రాజధాని నిర్మాణం కోసం  భూములిచ్చిన రైతులు భగ్గుమంటున్నారు.

 

రోడ్డుపైకి  వచ్చి నిరసనలు.. దీక్షలకు దిగారు. ఇప్పటికే రాజధాని వ్యవహారంపై రగడ కొనసాగుతుండగా  .విశాఖపట్నంలో జరిగిన సీఎం జగన్ జన్మదినోత్సవాల్లో పాల్గొన్న విజయసాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిక్యూటివ్ రాజధాని అంటే ముఖ్యమంత్రి, గవర్నర్, మిగిలిన మంత్రులకు అధికార నివాసం మాత్రమే కాదన్న విజయసాయి.. అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని చెప్పారు.

 

పారిశ్రామిక రంగం, సేవా రంగం, వ్యవసాయ రంగం అన్నింటిలో విశాఖ ముందంజలో ఉంటుందని మాట్లాడారు . విశాఖపట్నం వచ్చే  పదేళ్లో ముంబై తరహాలో అభివృద్ధి జరుగుతుందన్నారు ఎంపీ.అన్ని జిల్లాలను సమానంగా అభివృద్ధి చేయాలన్నాదే ప్రభుత్వ ఉద్దేశమని  విజయసాయి చెప్పారు .. పరిపాలన రాజధానిపై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పరిపాలన అంతా విశాఖ నుంచే జరుగుతుందని చెప్పారు .

 

అయితే సీఎం జగన్ అసెంబ్లీలో చేసిన ప్రకటన.. జీఎన్ రావు కమిటీ సిఫార్సులను అనుసరించే రాజధాని ఏర్పాటు ప్రక్రియ సాగుతున్నట్లుగా తెలుస్తోంది.అమరావతి లెజిస్టేచర్ క్యాపిటల్‌గా.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌.. కర్నూలు జ్యుడీషియల్ క్యాపిటల్‌గా ఉండొచ్చంటూ సీఎం వ్యాఖ్యానించారు. రాజధానిపై అధ్యయనం చేసేందుకు నియమించిన జీఎన్ రావు కమిటీ నివేదిక వచ్చిన తరువాత నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

 

సీఎం చెప్పిన జీఎన్ రావు కమిటీ శుక్రవారం తన నివేదకను సమర్పిచింది. రాజధాని విషయమై ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు చేసింది. ఏపీలో కొన్ని ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందాయని.. మరికొన్ని నేటికీ  చాల వెనకబడి ఉన్నాయని తెలిపింది . అన్ని ప్రాంతాలు  అభివృద్ధి సమానంగా ఉండేలా  ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని.. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని తన అభిప్రాయాన్ని వెల్లడించింది .

మరింత సమాచారం తెలుసుకోండి: