రోజురోజుకు పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారిపోతున్నాయి. బీజేపీ భారీగా ప్రచారం నిర్వహిస్తూ ఉండటం ఢిల్లీ పెద్దలు అందరూ కూడా రంగంలోకి దిగి పశ్చిమబెంగాల్ లో పోటీ చేస్తున్న అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించి ఓటర్ల ఆకట్టుకోవడం జరుగుతుంది. అయితేమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ ఏ బహిరంగ సభలో మాట్లాడిన బయట వ్యక్తులు బెంగాల్ లో వచ్చి పాలన సాగించాలని ప్రయత్నిస్తే రాష్ట్ర ప్రజలు ఊరుకోరు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే తాజాగా దీనిపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీని తనను తిట్టడం తప్ప పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వేరే పని అంటూ ఏదీ లేదు అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాల్ లోని హరి రాంపూర్ లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న అమిత్ షా ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీ పదేపదే తనను బయటి వ్యక్తి అంటూ వ్యాఖ్యానిస్తున్నారని.. అక్రమ వలసదారులే బయట వ్యక్తులు అవుతారని.. కానీ తాను భారత్లోనే పుట్టాను భారత్లోనే చేస్తాను తన అంత్యక్రియలు కూడా ఇక్కడే జరుగుతాయి అంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు. ఇక ఈ సందర్భంగా అందరూ బిజెపికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. బీజేపీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అవుతుంది అంటూ తెలిపారు.