రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చిన టీడీపీ, జనసేన పార్టీలు అభ్యర్ధుల ఎంపికపై దృష్టిపెట్టాయి. ఈ నేపథ్యంలో ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో రెండు పార్టీల అధినేతలు సుదీర్ఘంగా చర్చలు జరిపారు.సీట్ల సర్దుబాటుపై ఈ భేటీలో రెండు పార్టీలు దాదాపు స్పష్టతకు వచ్చాయి.ఇక ఇప్పటికే మూడుసార్లు సమావేశమైన చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌.. ఉమ్మడి మేనిఫెస్టో, సీట్ల సర్దుబాటుపై విడతలవారీగా చర్చించడం జరిగింది. ఇక నాలుగు రోజుల నుంచి హైదరాబాద్‌లోనే మకాం వేసిన చంద్రబాబు నాయుడు,పవన్‌కల్యాణ్‌.. ఆ పార్టీల అభ్యర్థుల ఎంపికపై విడివిడిగా కసరత్తులు చేశారు. తాజాగా ఉండవల్లిలో భేటీ అయిన ఈ ఇద్దరు అధినేతలు..కీలక అంశాలపై చర్చించడం జరిగింది. జనసేన పార్టీ పోటీ చేసే స్థానాల్లో టీడీపీ ఆశావహులకు..టీడీపీ పోటీ చేసే స్థానాల్లో జనసేన ఆశావహులకు రెండు పార్టీల అధినేతలు సర్ది చెప్పనున్నారు.ఇక మండపేట, అరకు స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే స్పష్టత నిచ్చిన చంద్రబాబు నాయుడు..ఆ స్థానాల్లో టీడీపీ అభ్యర్ధులను కూడా ప్రకటించారు. దానికి పోటీగా..రాజానగరం, రాజోలు స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు పవన్‌ కల్యాణ్.


 దీంతో మిగిలిన సీట్లపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కొంతమంది నేతలు త్యాగాలకు రెడీ కావాలని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా నేతలకు ఇప్పటికే చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇచ్చారు. పొత్తులో సీటు సర్దుబాటు కాని నేతలకు..పార్టీ, ప్రభుత్వంలో సముచిత స్థానంని కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇంకా అలాగే సిట్టింగ్ స్థానాల్లో ప్రస్తుత ఎమ్మెల్యేలకే అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. దీంతో పట్టు, విడుపులకు రెడీగా ఉన్నట్టు సిగ్నల్‌ ఇచ్చారు చంద్రబాబు నాయుడు.అధికార వైసీపీ వరుస జాబితాలు ప్రకటిస్తుండటంతో టీడీపీ-జనసేన నేతలపై ఒత్తిడి బాగా పెరుగుతోంది. మరోవైపు సీట్ల సర్దుబాటుపై అధికారిక ప్రకటన ఎప్పుడెప్పుడా అని ఇరు పార్టీల నేతలు ఇంకా కార్యకర్తలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే బీజేపీతో పొత్తు అంశం ఎటూ తేలకపోవడం వల్లే సీట్ల ప్రకటన ఆలస్యం అవుతున్నట్టు సమాచారం తెలుస్తోంది. ఇక తాను ఇప్పటికీ ఎన్డీఏలోనే ఉన్నానని పవన్‌ కల్యాణ్ చెబుతుండగా. .అటు బీజేపీ కూడా జనసేన పార్టీ తమ భాగస్వామ్య పార్టీ అని బీజేపీ చెబుతోంది. కానీ టీడీపీతో కలిసి పోటీ చేసే అంశంపై మాత్రం..బీజేపీ క్లారిటీనివ్వడం లేదు. ఒకవేళ బీజేపీ ఒంటరిపోరుకు దిగితే ఏం చేయాలన్నదానిపై కూడా టీడీపీ, జనసేన పార్టీ అధినేతలు చర్చించినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: