ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం కీలక మలుపులు తిరుగుతుంది.. ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికారమే లక్ష్యంగా అన్నీ ప్రధాన రాజకీయ పార్టీలు ప్రజలపై హామీల వర్షం కురిపిస్తున్నాయి.. అయితే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. గత ఎన్నికలలో ఒకే పార్టీ కోసం పనిచేసిన అన్నా చెల్లెళ్ళు ఈ సారి ఎన్నికలకు ప్రత్యర్థులుగా మారిపోయారు.. వై ఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్న ఎన్నికల ప్రచారం ప్రారంభించే ముందు ఇడుపుల పాయలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ కార్యక్రమానికి జగన్ తల్లి విజయమ్మ వచ్చారు.అయితే ఈ పరిణామం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. తల్లి విజయమ్మ మద్దతు జగన్‌కు ఉన్నట్లేనా అని అందరూ చర్చించుకున్నారు. అయితే కొద్ది రోజుల తర్వాత వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనకు ఇడుపుల పాయకు వచ్చారు. ఆమె కూడా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆమెతో పాటు ప్రత్యేక విమానంలో అక్కడికి విజయమ్మ కూడా వచ్చారు. కుమార్తె షర్మిల రానున్న ఎన్నికలలో విజయం సాధించాలని ఆశీర్వదించారు.

అటు కొడుకుకి..ఇటు కూతురికి కూడా ఆమె మద్దతుగా ఉంటున్నారు. తన ఇద్దరు బిడ్డలు రెండు కళ్ళ లాంటి వారని.. వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేసినప్పుడు విజయమ్మ ప్రకటించారు. ఇద్దరూ చెరో రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారని అది దైవ సంకల్పమని ఆమె చెప్పుకొచ్చారు.తాను కుమార్తెకు మద్దతుగా ఉండటానికి వైసీపీకి రాజీనామా చేసినట్లు గతంలో ఆమె తెలియజేశారు.. అయితే ఇప్పుడు సీన్ అంతా రివర్స్ అయింది. షర్మిల కూడా తెలంగాణ వదిలి ఏపీకి వచ్చారు. జగన్ ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్ తరుపున పని చేస్తున్నారు. దీనితో రాష్ట్ర రాజకీయాలలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి..ఇప్పుడు విజయమ్మ పరిస్థితి చెప్పలేని స్థితిలో వుంది.తన రెండు కళ్ళలో ఒక కంటికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి విజయమ్మకు వచ్చింది.. అయితే ప్రస్తుత పరిస్థితిలో తన మద్దతు ఎవరికో చెప్పలేకపోతున్నారు. అందుకే ఇద్దరూ ఏ కార్యక్రమానికి పిలిచినా ఆమె వెళ్తున్నారు.

కొడుకు జగన్ కు మద్దతు ఇస్తే విజయమ్మ కూడా ఇబ్బంది పడాల్సిందే. ఎందుకంటే వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా పేరు వినిపిస్తున్న అవినాష్ రెడ్డికే జగన్ ఈ సారి టికెట్ ఇచ్చారు. అయితే వివేకాను చంపింది అవినాషేనని షర్మిల గట్టిగా వాదిస్తున్నారు.తన ఎంపీ టికెట్ కోసం పోరాడినందు వల్లనే వివేకాను చంపేశారని షర్మిల ఆరోపిస్తున్నారు.అయితే విజయమ్మ మద్దతు షర్మిల వైపే ఉందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం కుమారుడుతో విజయమ్మకు అంతగా మాటల్లేవు. ప్రస్తుతం విజయమ్మ షర్మిల వద్దే ఉంటున్నారు.కానీ రాజకీయంగా తల్లి కూడా దూరమైందని వచ్చే విమర్శలు తిప్పికొట్టడానికి జగన్ అప్పుడప్పుడు తల్లి సెంటిమెంట్ ఉపయోగించుకుంటున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనితో విజయమ్మ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.తన మద్దతు కొడుకుకా లేక కూతురికా అనేది కచ్చితంగా చెప్పలేకపోతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: