ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. జమ్ము కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏకంగా 28 మంది యాత్రికులను కాల్చి చంపిన సంగతి తెలిసిందే. దీంతో.. పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇప్పటికే పాకిస్తాన్ కు సింధు జలాలను ఆపేసింది ఇండియన్ సర్కార్. ఆర్థిక మూలాలను కూడా దెబ్బ కొట్టేందుకు మోడీ ప్రభుత్వం... స్కెచ్ లు వేస్తోంది.

 అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కు మరో ఊహించని షాక్ ఇచ్చింది మోడీ ప్రభుత్వం. పహాల్గం ఉగ్రదాడి నేపథ్యంలో ఆర్థిక  పరంగా పాకిస్తాన్ కు మరో షాక్ ఇచ్చేందుకు ఇండియా సిద్ధమైంది. ఆ పాకిస్తాన్ దేశాన్ని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రేట్ లిస్టులో పెట్టేందుకు వచ్చే నెల... లో సంప్రదింపులు చేయబోతోంది మోడీ ప్రభుత్వం. ఈ దిశగా అడుగులు వేస్తోంది. ఈ ప్రయత్నాలు సక్సెస్ అయితే ఆర్థిక కార్యకలాపాలపై నిఘా పెరిగి పాకిస్తాన్ కు విదేశీ పెట్టుబడులు కూడా పూర్తిగా తగ్గిపోతాయని తెలుస్తోంది.

 మరోవైపు పాకిస్తాన్ దేశానికి 59 వేల కోట్ల ఐఎంఎఫ్ నిధులను కూడా  రాకుండా మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఒకవేళ ఇదే సక్సెస్ అయితే... పాకిస్తాన్కు ఆర్థికంగా తీవ్రమైన దెబ్బ పడనుంది. అయితే ఇండియా... ఇలా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో బార్డర్లో మాత్రం పాకిస్తాన్ తగ్గడం లేదు. ప్రతిరోజు బార్డర్లో కాల్పులు  చేస్తోంది పాకిస్తాన్ ఆర్మీ. వరుసగా తొమ్మిదో రోజు కూడా కాల్పులు నిర్వహించింది. చైనా దేశం... కూడా పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇలా కుట్రలు పన్నుతోందని అంటున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ : వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: