
ఈ సాంకేతికత వలన రోడ్డుప్రమాదాలు తగ్గడం, ఇంధన ఆదా, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, దృష్టి లోపం ఉన్నవారికి ప్రయాణ సౌలభ్యం వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రస్తుతానికి కొన్ని వాణిజ్య రంగాల్లో ముఖ్యంగా మైనింగ్, రవాణా, లాజిస్టిక్స్ రంగాల్లో ఈ డ్రైవర్లెస్ వాహనాలు విస్తృతంగా వినియోగంలోకి వస్తున్నాయి. భవిష్యత్తులో ఈ టెక్నాలజీ ప్రజల సాధారణ ప్రయాణాలకు కూడా విస్తరించనుందని నిపుణులు భావిస్తున్నారు. రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ నిరుద్యోగులను మరింతగా పెంచుతుందనడానికి ఇదీ ఒక ఉదాహరణ. ఇప్పటికే డ్రైవర్ లెస్ కార్లను అభివృద్ధి చేసిన చైనా, ట్రక్కులను సైతం అందుబాటులోకి తీసుకొచ్చింది. హువాయ్ టెక్నాలజీస్ అభివృద్ధి చేసిన ఈ ట్రక్కులు మైనింగ్ పరిశ్రమలో కీలకపాత్ర పోషించనున్నాయి. ఇన్నర్ మంగోలియాలోని యిమిన్ బొగ్గు గనిలో చైనా దాదాపు 100 డ్రైవర్ లెస్ ట్రక్కులను మొహరించింది.
చైనా హువానెంగ్ గ్రూప్, హువావే టెక్నాలజీస్, XCMG, స్టేట్ గ్రిడ్ స్మార్ట్ ఇంటర్నెట్ ఆఫ్ వెహికల్స్ సంయుక్తంగా.. ఇన్నర్ మంగోలియాలోని యిమిన్ ఓపెన్-పిట్ బొగ్గు గనిలో 100 డ్రైవర్లెస్ ఎలక్ట్రిక్ మైనింగ్ ట్రక్కుల బృందాన్ని ప్రారంభించింది. ఈ ట్రక్కులు, "హువానెంగ్ రుయిచీ" మోడల్గా పిలవబడుతున్నాయి. ఇవి ప్రపంచంలోనే అతిపెద్ద స్వయంచాలక మైనింగ్ ట్రక్కుల బృందంగా గుర్తించబడ్డాయి .
ఈ ట్రక్కులు 90 మెట్రిక్ టన్నుల బరువును మోయగల సామర్థ్యంతో, -40°C వరకు తక్కువ ఉష్ణోగ్రతలలో పనిచేయగలుగుతాయి. ఇవి డ్రైవర్లెస్గా ఉండడం వల్ల, మానవుల భద్రతను మెరుగుపరచడంలో సహాయపడతాయి. హువావే యొక్క 5G-అడ్వాన్స్డ్ (5G-A) నెట్వర్క్ ఆధారంగా, ఈ ట్రక్కులు క్లౌడ్తో సమన్వయంగా పనిచేస్తూ, రియల్టైమ్లో మార్గాలను ఆప్టిమైజ్ చేయగలుగుతాయి. ఈ ప్రాజెక్టు ద్వారా చైనా బొగ్గు గనుల పరిశ్రమలో సురక్షిత, స్మార్ట్, పర్యావరణ హితమైన మార్గాలను అన్వేషిస్తోంది. భవిష్యత్తులో ఈ మైనింగ్ ప్రాంతంలో 300 స్వయంచాలక ట్రక్కులను అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.