
ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతూ ఉండగా ఇక ఇప్పటికే ఫైనల్ లో అడుగు పెట్టింది అన్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ఇక ఆస్ట్రేలియా తో టెస్టు సిరీస్ లో భారత జట్టు ప్రదర్శన ఎలా ఉంటుంది అనేదానిపై ఆసక్తి నెలకొంది. ఇక అందరూ కూడా ఇదే విషయంపై చర్చిస్తూ ఉన్నారు. ఎంతో మంది మాజీ ఆటగాళ్ళు ఎవరి ప్రదర్శన ఎలా ఉంటుంది అనే దానిపై తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో సోషల్ మీడియాలో చెప్పేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇదే విషయంపై మాట్లాడాడు భారత టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ పూజార.
ఫిబ్రవరి 9 నుంచి భారత్ ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇరు జట్ల మధ్య రసవత్తరమైన పోరు ఉంటుంది అంటూ పూజార చెప్పుకొచ్చాడు. అయితే తన కెరియర్ లో 2018- 19 బోర్డర్ గవాస్కర్ సిరీస్ ఎంతో అత్యుత్తమమైనది అంటూ తెలిపాడు. ఇక ఈ సిరీస్ లో ప్రతి మ్యాచ్ కూడా ఒక సవాలుగా ఉండేది అంటూ గుర్తు చేసుకున్నాడు చటిశ్వర్పూజారా. అయితే అప్పుడు జరిగిన ఆ టెస్టు సిరీస్ లో అద్భుతమైన బ్యాటింగ్ చేసిన పూజార 521 పరుగులు చేశాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే భారత జట్టు 2-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది. ఈ విషయంలో పూజార కీలకపాత్ర వహించాడు.