ఈ మధ్యకాలంలో నేను అక్రమ సంబంధాలకు సంబంధించిన వార్తలను మనం నిత్యం వింటూనే ఉన్నాము. సమాజంను మరిచి వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న విషయాలు ఈ మధ్య కాలంలో ఎక్కువ అయిపోయాయి. అయితే ఇలాంటి విషయాలపై తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పు చర్చనీయాంశంగా మారింది. ఓ సైనిక అధికారి హోటల్ సీసీటీవీ ఫుటేజ్, బుకింగ్ వివరాలను విడుదల చేయాలనే అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ఆ అధికారి తన భార్య మరో సైనికుడితో అక్రమ సంబంధం ఉందని ఆరోపిస్తూ సాక్ష్యంగా సీసీటీవీ చిత్రాలు, బుకింగ్ రికార్డులను కోరాడు. ఈ విషయంలో పైత్యాల హౌస్ కోర్టు సివిల్ జడ్జి వైభవ్ ప్రతాప్ సింగ్, ఆధునిక భారతదేశం లింగభేదానికి, పురుష సాధికారత భావాలకు చోటు లేదని మహిళల గోప్యత హక్కులను ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. కోర్టు తీర్పులో భారత పార్లమెంట్ కూడా పాతకాలపు కలనీయ న్యాయ చట్టాలను తొలగిస్తూ, భారతీయ న్యాయ సంహితలో వ్యభిచారానికి (adultery) సంబంధించిన నిబంధనలను తొలగించడం ద్వారా ఈ జూరిస్ప్రూడెన్స్‌ కు మద్దతు ఇచ్చిందని చెప్పారు.

సైనికుడు తన భార్య, మరొక అధికారి మధ్య జనవరి 25, 26 తేదీలలో జరిగిన అనుమానాస్పద సమావేశం కోసం హోటల్ బుకింగ్ వివరాలు ఇంకా సీసీటీవీ ఫుటేజ్ కోరగా, హోటల్ తెలిపిన ప్రకారం సీసీటీవీ రికార్డులు 3 నెలలపాటు మాత్రమే నిల్వ ఉంటాయని, అవసరమైన ఫుటేజ్ ప్రస్తుతం అందుబాటులో లేదని వెల్లడించింది. హోటల్స్ తమ అతిథుల గోప్యతను పరిరక్షించే బాధ్యత ఉన్నాయని, హోటల్‌పై ఈ సమాచారం విడుదల చేయాల్సిన ఎలాంటి చట్టబద్ధ బాధ్యత లేదని, హోటల్ వివాదాల్లో పక్షంగా లేదని కోర్టు స్పష్టంచేసింది. అలాగే, ఏ వ్యక్తికి సంబంధించిన లేనిది అటువంటి గోప్య సమాచారం ఇతరులకు ఇవ్వడం అన్యాయం అని పేర్కొంది.

కోర్టు తీర్పులో చెప్పిన మరో ముఖ్య అంశం ఏమిటంటే.. భార్యను మరొకరితో ఉండడం అనే దృష్టిని అభ్యంతరకరంగా, న్యాయ సమాజంలో తగని భావనగా మానవ హక్కుల కోసం సమర్థించింది. సుప్రీంకోర్టు 1860 ఇండియన్ పెనల్ కోడ్ సెక్షన్ 497 (adultery)ని అనుసరిస్తుతు తీర్పును వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: