రెండు రోజుల క్రితం విశాఖ పరవాడ ఫార్మా సిటీ కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీలో ఒకరు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో గాయపడి ఆరిలోవ హెల్త్సిటీలోని పినాకిల్ ఆసుపత్రిలో కెమిస్ట్ మల్లేష్ చికిత్స పొందుతున్నారు. ఈ నేపధ్యంలో అతన్ని వైసీపీ రాజ్యసభ లోక్సభ ఎంపీలు విజయసాయి రెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ పరమార్శించి అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఆయనకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుంది అని హామీ ఇచ్చారు. వారితో పాటుగా ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు అదీప్ రాజ్, తిప్పల నాగిరెడ్డి, గుడివాడ అమరనాథ్ కూడా ఉన్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు