మీరు బంగారం కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? బంగారంపై పెట్టుబడి పెట్టి మంచి లాభాలు కావాలి అని అనుకుంటారా? అయితే మీకు శుభవార్త. తాజాగా కేంద్ర ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్లను ప్రతి నెలా జారీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2020 మార్చి వరకు ఈ ప్రయోజనం అందుబాటులోకి వస్తుంది. కానీ ఇందులో ఒక ట్విస్ట్ ఉంది అది ఏమిటి అంటే నెలలో కొన్ని రోజులు మాత్రమే ఈ బాండ్ల జారీ చేయడం జరుగుతుంది అని అధికారులు తెలిపారు.
ఇక రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ఏడో విడత జారీ డిసెంబర్ 2నే మొదలు పెట్టారు. కానీ డిసెంరబ్ 6 వరకు బాండ్ల జారీ చేయడం జరుగుతుంది అని తెలుస్తుంది. బంగారం కొనుగోలు చేయాలని భావించేవారు ఈ గోల్డ్ బాండ్లను కొనుగోలు చేసుకొని బంగారాన్ని తక్కువ రేటుకు పొందండి. ఇలా గోల్డ్ బాండ్లను తీసుకోవడం వల్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.39,770 అంటే ఒక గ్రాము ధర రూ.3977. కానీ ఒక గ్రాము బంగారం ధర కేవలం రూ.3,795. సావరిన్ గోల్డ్ బాండ్ రూపంలో bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవ్వడం జరుగుతుంది.
ఇక సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ గురించి పూర్తి వివరాలు ఇలా... సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2019-20 సిరీస్ VII ప్రకటించడం జరిగింది. ఇప్పటికే సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ సబ్స్క్రిప్షన్ కూడా మొదలు అయంది. ఈ సిరీస్లో bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించిన ఒక గ్రామ్ ధర రూ.3,795.
ఆన్లైన్లో అప్లై చేసి పేమెంట్ చేసే ఇన్వెస్టర్లకు ఒక గ్రాముపై రూ.50 డిస్కౌంట్ కూడా పొందే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2019-20 సిరీస్ VII డిసెంబర్ 6న ముగింపు పలకబోతుంది. ఇక మళ్లీ గోల్డ్ బాండ్ స్కీమ్ వచ్చే సంవత్సరం జనవరి 13 నుంచి 17 వరకు, ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు, మార్చి 2 నుంచి 6 వరకు గోల్డ్ బాండ్స్ జారీ చేయాలనీ నిర్ణయం తీసుకోవడం జరిగింది.