భారత్ లో ఖలిస్తాన్ ఉద్యమం పేరుతో చిచ్చురేపాలని చూస్తున్నటువంటి ఖలిస్తాన్ ఉగ్రనేత నిజ్జరును కొంతమంది కెనడాలో హత్య చేశారు. దీనిపై కెనడా ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడో భారత్ పై ఆరోపణలు చేశాడు. భారత ఏజెంట్లే నిజ్జర్ ను చంపారని కెనడా పార్లమెంటు సాక్షిగా భారత్ పై విమర్శలు గుప్పించారు.అయితే ఖలిస్తాన్ కు సంబంధించి ఉద్యమకారులు ఎక్కువగా కెనడాలో ఉంటారు. దీని తర్వాత బ్రిటన్ అమెరికాలో కూడా ఖలిస్తాన్ మద్దతుదారులు ఎక్కువ మంది నివసిస్తున్నారు. ఇండియాలో ఖలిస్తాన్ ఉద్యమానికి సంబంధించి ఫండ్స్ అందిస్తూ దేశంలో చిచ్చు రేపేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.


కాబట్టి ఈ విషయంలో అమెరికా బ్రిటన్ కెనడా లాంటి ప్రాంతాలు ఖలిస్తాన్ ఉద్యమకారులను ఏ మాత్రం ప్రోత్సహించకూడదు. కానీ అక్కడి ప్రభుత్వాలు తమ పౌరులుగా భావిస్తూ వారిని ఏ విధంగా హత్య చేశారని కెనడా మాట్లాడుతుంది.  దీనికి అమెరికా కూడా సపోర్ట్ చేస్తుంది. అయితే ఒక దేశంలోకి మరో దేశంలో ఉన్న ఉంటూ ఈ దేశంలో వేరే దేశం కోసం పోరాటం చేస్తే చూస్తూ ఊరుకుంటారా అని ఇండియన్స్ ప్రశ్నిస్తున్నారు.


అమెరికాలో కూడా ఉన్న చాలా మంది భారతీయులు అమెరికన్స్ కూడా దీనిపై జో బైడెన్ వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే నిద్ర హత్య కేసులో భారత్ వివరాలు సమర్పించాలని కోరడం కూడా ఇండియా వ్యతిరేకంగా పనిచేసినట్టే భారతదేశ సమగ్ర సౌబ్రాతత్వాన్ని కావాలనే దెబ్బతీయాలని ఖలిస్తాన్ ఉద్యమకారుడు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి ఆయా దేశాలు మద్దతుగా నిలవడం అనేది సరైన విషయం కాదు.


గతంలో అమెరికా తాలిబాన్ల విషయంలో ప్రవర్తించిన విధానాన్ని భారత్ కూడా ప్రోత్సహించింది. ఎక్కడ ఉగ్రవాదులు ఉన్నాకూడా వారిని అంతర్ చేస్తేనే ప్రపంచ దేశాలకు శాంతి చేకూరుతుందని భారత్ భావిస్తుంది కానీ అమెరికా మాత్రం ఉగ్రవాది అనే పేరుతో బిన్ లాడెన్ చంపినా కూడా తప్పులేదు. కానీ భారత మాత్రం తమ దేశంలో చిచ్చు రేపుతున్న వారి గురించి ప్రశ్నిస్తే మాత్రం అనుమానించడం తగదని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: