ఈ బ్రిటిష్ రెసిడెన్సీ బ్రిటిష్ పాలకుల రాజసానికి ఓ ఉదాహరణ. మూసీ నదికి నగరం అభివృద్ధి చెందేందుకు కారణమైన భవనం. వేలాది మంది విద్యార్థినులకు విద్యాగంధం పూసిన మణిహారం. రెండు వందల ఏళ్ల చరిత్ర ఉన్న కోఠిలోని ఈ బ్రిటీష్ రెసిడెన్సీ భవనం ఇప్పుడు సందర్శకుల కోసం అందుబాటులోకి వస్తోంది. వరల్డ్ మాన్యుమెంట్ ఫండ్ ఈ బ్రిటిష్ రెసిడెన్సీ సరికొత్త అందాలు సంతరించుకుని సరికొత్తగా ముస్తాబైంది. ఇప్పటి వరకూ ఈ బ్రిటిష్ రెసిడెన్సీ అందాలు చూసేందుకు కోఠి కళాశాల విద్యార్థులకు మాత్రమే అనుమతి ఉండేది.
త్వరలో ఈబ్రిటిష్ రెసిడెన్సీని సాధారణ ప్రజలకూ అందుబాటులోకి తేనున్నారు. టికెట్ వ్యవస్థ పెట్టి ప్రజలు చూసేందుకు అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఈ బ్రిటిష్ రెసిడెన్సీ మొదటి అంతస్తులో మ్యూజియం ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియంలో 1779-1947 మధ్య ఈ భవనంలో నివసించిన వారి ఫొటోలు, పేర్లు, ఈ బ్రిటిష్ రెసిడెన్సీ భవనం చరిత్ర, నిజాం నవాబుల చిత్రపటాలు, ఆనాటి వేడుకల ఫోటోలు, వివిధ సందర్భాల్లో తీసిన చిత్రాలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు.
ఈ భవనానికి చాలా ప్రత్యేకత ఉంది. దీన్ని చెన్నై ఇంజినీర్ శామ్యూల్ రసెల్స్ డిజైన్ చేశాడు. 1803లో దీని నిర్మాణం పూర్తయింది. 1797-1805 మధ్య దీనిలో జేఏ కిర్క్ప్యాట్రిక్స్ నివసిరంచారు. ఆయన ఖైరున్నీసా బేగం అనే పాతబస్తీ రాచవనితను ప్రేమించి పెళ్లాడారు. ఆమెతో ఇక్కడే నివసించారు. స్వాతంత్య్రం వచ్చాక హైదరాబాద్ రాష్ట్రం ఇండియాలో విలీనం అయ్యాక ఈ భవనాన్ని ఉస్మానియా మహిళా కళాశాలగా మార్చి చదువుల నిలయంగా మార్చారు.