తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి పరుశురామ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యువత మూవీ తో దర్శకుడుగా కెరియర్ ను మొదలు పెట్టిన పరుశురామ్ ఆ తర్వాత సోలో , శ్రీరస్తు శుభమస్తు , గీత గోవిందం , సర్కారు వారి పాట మూవీ లతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ దర్శకుడు గా మారిపోయాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ దర్శకుడు ఊర్వశివో రాక్షసివో మూవీ  ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా బాలకృష్ణ కోసం ఒక కథను రెడీ చేస్తున్నాను అని చెప్పుకొచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం పరుశురామ్ , బాలకృష్ణ కోసం తాజా కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది. అలాగే వచ్చే వారం ఈ దర్శకుడు బాలకృష్ణ కు కథను వినిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కథ విని బాలకృష్ణ ఎలా రియాక్ట్ అవుతాడు చూడాలి. ఒక వేళ పరుశురామ్ చెప్పిన కథ కనుక బాలకృష్ణ కు నచ్చినట్లు అయితే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ , గోపీచంద్ మలినేని దర్శకత్వం లో తెరకెక్కుతున్న వీర సింహా రెడ్డి అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు.

మూవీ లో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. వీర సింహా రెడ్డి మూవీ ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ , అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కబోయే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చి చాలా రోజులు అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: