అతిత్వరలోనే అక్కినేని నాగార్జున గారింట్లో పెళ్లిబాజాలు, పెళ్ళి సందళ్ళు మోగబోతున్నాయి. నాగార్జున చిన్న కొడుకు అఖిల్ వివాహం, ప్రముఖ పారిశ్రామికవేత్త జీవీకే మనుమరాలు శ్రియా భూపాల్తో నిశ్చయమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు కుటుంబాల్లోనూ పెళ్లిపనులను శతవేగంగా పూర్తిచేస్తున్నారు. మండువేసవి మే నెలలో, అఖిల్- శ్రియా వివాహం వేడుకగా ఇటలీ లో జరగబోతోంది.
మరి ఈ పెళ్లికి అతి తక్కువ మంది అతిథులే హాజరు కాబోతున్నారట. ఆ విషయాలను అక్కినేని నాగార్జునే వెల్లడించారు. కేవలం 150 మంది అథిదుల సమక్షంలోనే పెళ్లివేడుక జరుగుతుందని, రిసెప్షన్ వేడుక చాలా గ్రాండ్గా హైదరాబాద్లో చేస్తామని చెప్పాడు. యాభై ఏళ్లు పైబడినా ఇప్పటికీ మన్మథుడి లానే కనిపించే నాగార్జునను, వచ్చే కోడళ్లు ఏమని పిలుస్తారు? అంటే నాగార్జున చెప్పిన సమాధానం కొంచెం ఆసక్తికరంగానే ఉంది. మామయ్య అని పిలచేందుకు వచ్చే కోడళ్లకు ఇబ్బందిగా ఉంటుం దేమో? అని అన్నారు.
శ్రియా భూపాల్ చిన్నప్పట్నుంచి తెలుసని, తనను "నాగ్ మామ" అంటూ పిలిచే అలవాటు ఉందని ఆమె అలా పిలవటానికి శ్రేయకు పిలిపించుకోవటానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పుకొచ్చారు.
అయితే, ఈ పిలుపి విషయంలో సమంతా కే కొంచెం సమస్య ఉంటుందని అన్నారు నాగార్జున. "నన్ను ఎలా పిలుస్తావ్" అని సమంత ను అడుగుతున్నానని, తనేమో నవ్వేసి ఊరు కుంటోందని అన్నాడు. ఎప్పుడూ ‘నాగ్ సార్’ అని సమంతా పిలుస్తుందని చెప్పిన నాగార్జున ఇక పై "అలా పిలిస్తే చంపేస్తానని సమంత" కు చెప్పినట్లు వివరించారు. అయితే సమంత మాత్రం తనను "ఏమని పిలవాలో" ఇంకా నిర్ణయించుకోలేదని నవ్వేశారు మన నవ మన్మధుడు.