ప్రిన్స్ మహేష్బాబు - హ్యాట్రిక్ హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో వస్తోన్న భరత్ అనే నేను సినిమాపై టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్లోనూ, ఇటు ట్రేడ్ వర్గాల్లోనూ ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన శ్రీమంతుడు సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు ఇటు కొరటాల శివ మూడు వరుస హిట్లతో టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడిగా ఉండడంతో ఇప్పుడు ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
ఇక తాజాగా భరత్ అనే నేను సినిమా రన్ టైంపై ఆసక్తికర వార్త వినిపిస్తోంది. ఒకప్పుడు సినిమాలకి సంబంధించి నిడివి మూడు గంటలపైనే ఉండేది. ఆ తర్వాత కాలంలో అది రెండున్నర గంటలకే పరిమితమైంది. ఇప్పుడు కొన్ని సినిమాలను రెండు గంటల్లో కూడా తేల్చేస్తున్నారు. కాని కథ, కథనంలో ఆసక్తిని రేకెత్తిస్తూ.. స్క్రీన్ప్లే పరుగెడుతున్నపుడు రన్ టైమ్ పెద్ద విషయం కాదన్నది ‘బాహుబలి: ది కంక్లూజన్’, ‘అర్జున్ రెడ్డి’, ‘రంగస్థలం’ సినిమాలు నిరూపించాయి.
బలమైన కంటెంట్తో ప్రేక్షకుడిని థియేటర్లో కూర్చోపెట్టాలే గాని రన్ టైం అన్నది ఇప్పుడు పెద్ద సమస్య కాదు. ఇక కొరటాల సినిమా రన్ టైం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక భరత్ అనే నేను రన్ టైమ్ రెండు గంటల నలభై నిమిషాలు ఉండేట్టు రూపొందించారట. శ్రీమంతుడు కంటే రెండు నిమిషాల తక్కువగానే ఈ సినిమా నిడివి ఉందని సమాచారం.
మహేష్బాబు కెరీర్లో ఫస్ట్ టైం సీఎంగా నటిస్తోన్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. మహేష్బాబు సరసన కైరా అద్వానీ హీరోయిన్గా నటించింది. ఏప్రిల్ 20న వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ అవుతోంది.