విజయ్ దేవరకొండ.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరో స్థాయి తెచ్చుకున్న నటుడు. ఈ హీరోకి యూత్ లో మంచి క్రేజ్ ఉంది.
విజయ్ ని రౌడీ స్టార్ అంటూ ప్రేమగా పిలుచుకుంటున్నారు. అయితే
విజయ్ హీరోగా ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు.
క్రాంతి మాధవ్ దర్శకత్వంలో "వరల్డ్ ఫేమస్ లవర్" చిత్రీకరణ జరుపుకుంటుంది. ఆ తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కబోతుంది.
అయితే అదలా ఉంచితే, హీరోగా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న
విజయ్ నిర్మాతగా మారాడు. తన మొదటి సినిమా "పెళ్ళి చూపులు" దర్శకుడయిన
తరుణ్ భాస్కర్ హీరోగా ఓ సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమాకి " మీకు మాత్రమే చెప్తా" అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశాడు. అయితే రీసెంత్ గా ఈ సినిమా టీజర్ కూడా విడుదలైంది. దర్శకుడయిన
తరుణ్ భాస్కర్ ఈ సినిమాలో చక్కని నటన కనబరిచాడని టాక్.
అయితే తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించింది చిత్ర బృందం. నవంబర్ 1న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారట. ఈ సందర్భంగా నిర్మాత
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ…, “ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్, రెండు సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచోడు అనే ఇమేజ్ ని కాపాడుకునేందుకు ప్రతి మనిషి ప్రయత్నిస్తుంటాడు. ఆ ఇమేజ్ ని డామేజ్ చేసే చిన్న తప్పును దిద్దుకునే ప్రయత్నంలో ఎంత కామెడీ పండిందనేది నవంబర్ 1న తెరమీద చూడబోతున్నారు.
ఇంకా,యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఉన్న ఈ కాన్సెప్ట్ ని అందరూ యాక్పెప్ట్ చేస్తారనే నమ్మకం ఉంది అని అన్నారు.
తరుణ్ భాస్కర్, హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అభినవ్ గోమటం,అనసూయ భరద్వాజ్,
వాణి భోజన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై
విజయ్ దేవరకొండ నిర్మిస్తున్న ఈ చిత్రానికి షమీర్ సుల్తాన్ దర్శకత్వం వహిస్తున్నారు.