వెంకీ కుడుములు దర్శకత్వంలో వచ్చిన
ఛలో సినిమాతో
టాలీవుడ్ కి
హీరోయిన్ గా పరిచయమైన
రష్మిక మందన్న, తొలి సినిమాతోనే మంచి
సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవడంతో పాటు కుర్రకారుని తన అందంతో ముగ్ధుల్ని చేసింది అనే చెప్పాలి. ఇక ఆ తరువాత ఆమె రౌడీ
హీరో విజయ్ దేవరకొండ సరసన నటించిన
గీత గోవిందం
సినిమా మరింత గొప్ప విజయాన్ని అందుకుని,
రష్మిక కెరీర్ కి మంచి బ్రేక్ ని అందించింది. ఆ తరువాత
నాగార్జున మరియు నానిల కలయికలో వచ్చిన
దేవదాస్ లో నటించినప్పటికీ ఆ
సినిమా మాత్రం ఆశించిన రేంజ్ విజయాన్ని రష్మికకు అందివ్వలేదనే చెప్పాలి.
ఇకపోతే నేడు కొన్ని
టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, అతి త్వరలో
విజయ్ దేవరకొండ మరియు
పూరి జగన్నాథ్ కలయికలో తెరకెక్కనున్న ఫైటర్ సినిమాలో ఆమెను
హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ
సినిమా కథ తనకు ఎంతో నచ్చడంతో పాటు,
విజయ్ తో తనకు మంచి అనుబంధం ఉండడంతో
రష్మిక ఈ సినిమాలో నటించడానికి పచ్చ జండా ఊపిందట. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త పై
సినిమా యూనిట్ నుండి అధికారిక ప్రకటన మాత్రం రావలసి ఉంది...!!