భారతీయ చనల చిత్ర సీమలో అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్న నటి శ్రీదేవి బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి పదహారేళ్ల వయసు లో హీరోయిన్ గా స్టార్ హీరోల సరసన నటించింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్,కృష్ణ, శోభన్ బాబు లాంటి హీరోలతో నటించిన తర్వాత వారి తర్వాత తరం చిరంజీవి,నాగార్జున, వెంకటేష్ లతో సైతం నటించింది. దుబాయ్ లో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్లిన ఆమె అనుకోకుండా మృత్యువడిలోకి చేరుకుంది. ఆమె బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనికపూర్ ని వివాహం చేసుకుంది. ఈ జంటకు జాన్వీ, ఖుషీ కపూర్ లు జన్మించారు. ప్రస్తుతం జాన్వీ కపూర్ బాలీవుడ్ హీరోయిన్ గా కొనసాగుతుంది.
‘ధడక్’ మూవీతో వెండి తెరకు పరిచయం అయిన జాన్వీ మొదటి సినిమాతోనే అందరి మనసు దోచింది. ప్రస్తుతం శరణ్శర్మ దర్శకత్వంలో ‘గుంజన్ సక్సేనా..ద కార్గిల్ గర్ల్' మూవీలో నటిస్తుంది. ఇది కార్గిల్ యుద్ద సమయంలో పాల్గొన్న భారతీయ తొలి మహిళా పైలట్ గుంజన్ సక్సేనా జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. దాదాపు ఈ మూవీ చిత్రీకరణ పూర్తి అయినట్లే అంటున్నారు చిత్ర యూనిట్. తాజాగా ఈ మూవీ గురించి కొన్ని విశేషాలు మాట్లాడారు నటి జాన్వీ కపూర్. ఈ సినిమాలో నటించడం మరపురాని అనుభూతినిచ్చిందని, తన జీవితకాల స్వప్నం నెరవేరిందని చెప్పింది. నా చిన్నప్పటి నుంచి నేను పైలెట్ కావాలనే కోరిక బలంగా ఉండేదని.. కానీ అనుకోని పరిస్థితుల్లో నటిగా మారానని అన్నారు.
అయితే ‘గుంజన్ సక్సేనా..ద కార్గిల్ గర్ల్' పుణ్యమా అని నా కోరిక నెరవేరిందని అన్నారు. ఈ సినిమా కోసం హెలికాప్టర్ నడిపాను. తొలుత శిక్షణ కోసం ఓ పైలట్ నా వెంట వుండేవాడు. గంటల కొద్ది హెలికాప్టర్లోనే గడపడం వల్ల నియంత్రణకు సంబంధించిన సాంకేతిక విషయాలపై మంచి పరిజ్ఞానం పెంచుకున్నానని అన్నారు. షూటింగ్ తొలిరోజు హెలికాప్టర్ ఎక్కగానే కన్నీళ్లు ఆగలేదు. నా కల ఈ రకంగా నెరవేరడంతో ఆనందోత్సాహాన్ని ఆపుకోలేక ఉద్వేగానికి గురయ్యాను. మార్చి 13న ఈ మూవీ ప్రేక్షకులముందుకురానుంది.