ఎప్పుడు ముక్కుసూటిగా మాట్లాడుతూ వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. అయితే ఇటీవలే క్రాక్ సినిమాలో జయమ్మ అనే పాత్రలో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ ఎంతో అద్భుతమైన నటనతో మెప్పించింది. ఈ క్రమంలోనే పలు మీడియా ఛానళ్లకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది ఈ అమ్మడు. ఇక ఈ ఇంటర్వ్యూ లో భాగంగా తన సవతి తల్లి రాధిక పై వరలక్ష్మి శరత్ కుమార్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి. ఇటీవలే ఓ ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ.. రాధిక ఆంటీ అంటే ఎంతో ఇష్టమని.. ఆమె మంచి వ్యక్తి అంటూ చెప్పుకొచ్చింది.. మేమిద్దరం ఎప్పుడూ సరదాగా క్లోజ్ గానే ఉంటాం కానీ ఎప్పుడైనా ఏదైనా సీక్రెట్ ఆమెకు చెప్పానంటే దాన్ని వెంటనే లీక్ చేసేస్తుంది.. ఇలా ఎన్నో సార్లు ఇబ్బంది పెట్టింది.. అయితే ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా చేయదు కానీ పొరపాటున జరిగిపోతుంది అంటూ వ్యాఖ్యానించింది వరలక్ష్మి శరత్ కుమార్.
ఈ క్రమంలోనే ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక గతంలో కూడా ఇలాంటి తరహా వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది వరలక్ష్మి శరత్ కుమార్. రాధిక తన తండ్రికి రెండవ భార్య అయినప్పటికీ తనకు మాత్రం ఎప్పటికీ తల్లి కాలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎవరికైనా అమ్మ ఒక్కరే ఉంటారని.. అందుకే తన తండ్రి రాధికను రెండో పెళ్లి చేసుకున్న తాను రాధికను ఆంటీ అని పిలుస్తాను అంటూ ఎప్పుడో క్లారిటీ ఇచ్చి వార్తల్లో హాట్ టాపిక్గా నిలిచింది వరలక్ష్మి శరత్ కుమార్..