శ్రీనివాస్ , రేష్మ రాథోడ్ ప్రధాన పాత్రలలో 2011 వ సంవత్సరం లో "ఈ రోజుల్లో" అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా.తోనే మారుతీ దర్శకుడి గా తన కెరియర్ ను మొదలు పెట్టాడు. ఇకపోతే తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా పెద్దగా ఎలాంటి అంచనాలు లేకుండా చాలా చిన్న సినిమాగా థియేటర్ లలో విడుదల అయింది.

ఇకపోతే థియేటర్ లలో విడుదల అయిన తర్వాత ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి మౌత్ టాక్ రావడంతో ఈ మూవీ కి మెల్ల మెల్లగా కలెక్షన్ లు పెరుగుతూ వచ్చాయి. అలా మెల్ల మెల్లగా ఈ సినిమా కలెక్షన్ లు పెరుగుతూ ఈ మూవీ మంచి విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా భారీ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టి అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర నమోదు చేసుకుంది. ఇలా ఆ సమయం లో మంచి విజయం సాధించిన ఈ సినిమాను తిరిగి దాదాపు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు.

తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇకపోతే ఈ సినిమాని మార్చి 23 వ తేదీన రీ రిలీస్ చేయబోతున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. మరి 2011 వ సంవత్సరం లో పెద్దగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లను వాసులు చేసిన ఈ సినిమా రీ రిలీస్ లో భాగంగా కూడా అదే రేంజ్ ఇంపాక్ట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర చూపిస్తుందో లేదో తెలియాలి అంటే మార్చి 23 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: