నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో తెరంగేట్రానికి రంగం సిద్ధమైంది. త్వరలో నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్రం ఉంటుందని తెలుస్తుండగా అతనికన్నా ముందే మరో నందమూరి హీరో సినిమాల్లోకి వస్తున్నాడు.అంతేకాదు వచ్చే హీరో పేరు కూడా నందమూరి తారక రామారావే అంటే ఎన్టీఆర్ అన్నమాట. ఇంతకీ వచ్చేది ఎవరు అంటే హరికృష్ణ పెద్ద కొడుకు నందమూరి జానకిరాం పెద్ద కొడుకు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అతని పేరు కూడా ఎన్టీఆర్ కావడం విశేషం.సీనియర్ ఎన్.టి.ఆర్ తర్వాత ఆయన పేరుతో జూనియర్ ఎన్టీఆర్ అదరగొట్టేస్తున్నాడు. తన నట విశ్వరూపంలో తాతకు తగ్గ మనవడు అనిపిస్తున్నాడు. ఇక ఇప్పుడు అదే ఎన్టీఆర్ పేరుతో మరో హీఓరో అదే ఫ్యామిలీ నుంచి రాబోతున్నాడు. నందమూరి జానకిరాం తనయుడు ఎన్టీఆర్ హీరోగా వైవిఎస్ చౌదరి డైరెక్షన్ లో త్వరలో సినిమా మొదలు కాబోతుందని తెలుస్తుంది. వైవిఎస్ చౌదరి ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మెగా ఫోన్ పట్టుకుంటున్న ఈ సినిమా ఒక లవ్ స్టోరీగా రాబోతుందని తెలుస్తుంది.మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని కొనేళ్లుగా ఎదురుచూస్తున్న నందమూరి ఫ్యాన్స్ కి మరో నందమూరి హీరో అదే ఎన్టీఆర్ తెరంగేట్రమని తెలిసి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. మరి ఈ నవ యువ ఎన్టీఆర్ కెరీర్ ఎలా ఉండబోతుందో చూడాలి. మోక్షజ్ఞ మొదటి సినిమా డైరెక్షన్ ఛాన్స్ బోయపాటి శ్రీనుకి ఇచ్చారని లేటెస్ట్ టాక్. మోక్షజ్ఞ రాకకోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.ఎవరికి వారు హీరోలుగా సత్తాను చాటుతున్నారు. ఇకపోతే బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. అయితే మోక్షజ్ఞ కంటే ముందే మరో నందమూరి వారసుడు హీరోగా పరిచయం కాబోతున్నాడట. అతను ఎవరో కాదు..

హరికృష్ణ మనవడు. హరికృష్ణ కు ముగ్గురు కొడుకులు కాగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హీరోలుగా రాణిస్తున్నారు.పెద్ద కొడుకు జానకిరామ్ మాత్రం నిర్మాణానికే పరిమితమయ్యారు. 2014 లో రోడ్డు ప్రమాదానికి గురై ఆయన కన్నుమూశారు. అయితే ఇప్పుడు జానకిరామ్ పెద్ద కుమారుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.అంతేకాదు ఆ బాధ్యతను దర్శకుడు వై.వి.ఎస్. చౌదరి తీసుకున్నట్లు సమాచారం.  నందమూరి కుటుంబంతో వై.వి.ఎస్. చౌదరికి మంచి అనుబంధం ఉంది.ముఖ్యంగా హరికృష్ణతో మంచి బాండింగ్ ఉండేది. వీరి కలయికలో వచ్చిన సీతారామరాజు', లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య లాంటి మంచి మంచి సినిమాలను తెరకెక్కించారు.ఆ మూవీస్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే వరుస పరాజయాలు పలకరించడంతో కొన్నేళ్లుగా వై.వి.ఎస్. చౌదరి మెగాఫోన్ పట్టలేదు.మరోవైపు హరికృష్ణ కూడా 2018 లో రోడ్డు ప్రమాదంలో మరణించారు. అయితే హరికృష్ణ లేనప్పటికీ ఆయన మీద అభిమానంతో ఇప్పుడు జానకిరామ్ పెద్ద కొడుకుని హీరోగా పరిచయం చేసే బాధ్యత వై.వి.ఎస్. చౌదరి తీసుకున్నాడట.   హరికృష్ణ మనవడు ఒక మంచి లవ్ స్టోరీతో ఎంట్రీ ఇస్తున్నట్లు వినికిడి. 2006లో రామ్ పోతినేనిని హీరోగా పరిచయం చేస్తూ వై.వి.ఎస్ రూపొందించిన ప్రేమ కథా చిత్రం దేవదాసు ఘన విజయం సాధించింది. చాలా గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న వై.వి.ఎస్ మళ్ళీ ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తాడేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: