స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, బ్యూటీ క్వీన్ అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ టిల్లు స్క్వేర్ .. గత కొంతకాలంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ క్రేజీ రొమాంటిక్ కామెడీ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.రేపు (మార్చి 29) ఈ చిత్రం థియేటర్లలో  గ్రాండ్ గా రిలీజ్ కానుంది. 2022లో వచ్చిన బ్లాక్‍బస్టర్ మూవీ డీజే టిల్లుకు సీక్వెల్‍గా టిల్లు స్క్వేర్ మూవీ తెరకెక్కింది.ఈ క్రేజీ మూవీకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు.. ఇదిలా ఉంటే ఈ క్రేజీ మూవీ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్ అయింది..టిల్లు స్క్వేర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట‍్‍ఫామ్ 'నెట్‍ఫ్లిక్స్' సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ పూర్తి అయిన తర్వాత ఈ సినిమా స్ట్రీమింగ్‍కు రానుంది.

మూవీ డిజిటల్ రైట్స్ ను నెట్‍ ఫ్లిక్స్ భారీ మొత్తంలో కొనుగోలు చేసినట్లు సమాచారం.అయితే డీజే టిల్లు సినిమా ఆహా ఓటీటీలో అందుబాటులో వుంది.. టిల్లు స్క్వేర్ హక్కులను మాత్రం నెట్‍ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ మూవీకి భారీగా క్రేజ్ ఉండటంతో నెట్‍ఫ్లిక్స్ థియేట్రికల్ రిలీజ్‍కు ముందే ఓటీటీ డీల్ చేసుకుంది..డీజే టిల్లు మూవీతో సిద్ధు జొన్నలగడ్డ పోషించిన 'టిల్లు' క్యారెక్టర్ ఐకానిక్‍గా మారింది. ఆయన వెరైటీ డైలాగ్ డెలివరీ, ఫ్రస్టేషన్ మరియు కామెడీ టైమింగ్ ఇలా చాలా అంశాలతో టిల్లు పాత్రకు పిచ్చ క్రేజ్ వచ్చింది. అయితే, థీమ్ ఒకటే అయినా కూడా డీజే టిల్లు కథకు ఇప్పుడు రానున్న టిల్లు స్క్వేర్ స్టోరీకి సంబంధం ఉండదని మూవీ టీమ్ గతంలోనే తెలియజేసింది.రీసెంట్ గా రిలీజ్ చేసిన టిల్లు స్క్వేర్ ట్రైలర్ సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది.. సిద్ధు మరోసారి తన మార్క్ యాక్టింగ్‍తో అదరగొట్టబోతున్నాడు..అనుపమ పరమేశ్వన్ గ్లామర్ ఈ మూవీకి హైలైట్ కానున్నట్లు తెలుస్తుంది.టిల్లు స్క్వేర్ చిత్రంలో మురళీధర్ గౌడ్, ప్రిన్స్ సెసిల్ మరియు ప్రణీత్ రెడ్డి కల్లెమ్ ముఖ్య పాత్రలు పోషించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: