విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన ఫ్యామిలీ స్టార్ మూవీ ఏప్రిల్ 5 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి పరశురామ్ దర్శకత్వం వహించగా ... గోపి సుందర్మూవీ కి సంగీతం అందించాడు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. ఇక కొన్ని సంవత్సరాలు క్రితం విజయ్ , పరుశురామ్ కాంబో లో గీత గోవిందం మూవీ రూపొంది అద్భుతమైన విజయం సాధించింది. వీరి కాంబో లో ఇది రెండవ సినిమా కావడంతో ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇలా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగి ఉన్న నేపథ్యం లో ఈ మూవీ కి భారీ మొత్తం ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది.

ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా దాదాపుగా 43 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. ఈ మూవీ 44 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేశారు. అలాగే రన్ టైమ్ ను కూడా లాక్ చేశారు. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి (యు / ఎ) సర్టిఫికెట్ లభించగా ... ఈ మూవీ 163 నిమిషాల 20 సెకండ్ల (2 గంటల 43 నిమిషాల 20 సెకండ్స్) నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఒక విధంగా చూసుకుంటే ఫ్యామిలీ స్టార్ కాస్త ఎక్కువ రన్ టైమ్ తోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి సినిమా గ్రిప్పింగ్ గా ఉన్నట్లు అయితే ఇది పెద్ద రన్ టైం ఏమీ కాదు. కానీ సినిమా ఎక్కడైనా స్లో అయితే మాత్రం ఈ నిడివితో ఈ మూవీ కి ప్రమాదం వచ్చే అవకాశం చాలా వరకు ఉంది అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vd