- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో .. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ‘ అఖండ 2 ’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెర‌కెక్కిస్తున్నాడు. అఖండ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సినిమాకు సీక్వెల్ గా వ‌స్తోన్న అఖండ 2 - తాండ‌వం పై టాలీవుడ్ లోనూ .. ఇటు ట్రేడ్ స‌ర్కిల్స్ లోనూ భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే ఈ అఖండ 2 షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇటీవల గోదావరి ప్రాంతంలో ఈ సినిమా కు సంబంధించిన ఓ షెడ్యూల్ పూర్తి చేశారు.


అయితే ఇప్పుడు ఈ సినిమా లో కీల‌క‌మైన సీన్లు షూట్ చేసేందుకు ద‌ర్శ‌కుడు బోయపాటి జార్జియాలో లొకేషన్స్ వేట కొనసాగిస్తున్నారు. అక్క‌డ హిందూత్వం నేప‌థ్యంలో వ‌చ్చే కొన్ని సీన్లు షూట్ చేస్తార‌ట‌. ఈ సినిమాకు సంబంధించి ఓ కీలక షెడ్యూల్ ను త్వరలోనే జార్జియాలో షూట్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అక్క‌డే ఈ హిందూత్వ సీన్లు కూడా షూటింగ్ చేస్తార‌ని స‌మాచారం. ఇక ఈ షెడ్యూల్ లో హీరో బాలయ్యతో పాటు మరికొందరిపై ఇక్కడ సీన్స్ షూట్ చేయ‌బోతున్న‌ట్టు గా తెలుస్తోంది. మే మొదటి వారంలో అఖండ 2 - తాండ‌వం యూనిట్ జార్జియా పయనం కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


ఇక ఈ సినిమాలో బాలయ్య మరోసారి అఘోరి పాత్రలో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అందాల భామ సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా యంగ్ హీరో ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటిస్తున్నాడు. అలాగే చాలా యేళ్ల త‌ర్వాత సీనియ‌ర్ హీరోయిన్ విజ‌య‌శాంతి కూడా ఈ సినిమా లో పొలిటిక‌ల్ లీడ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతోంద‌ని ప్ర‌చారం న‌డుస్తోంది. ఎస్ ఎస్ . థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: