
2017లో మలయాళ చిత్రంతో నటిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఐశ్వర్య లక్ష్మి.. అనతి కాలంలోనే తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులకు దగ్గరైంది. మలయాళంతో పాటు తమిళ్, తెలుగు భాషల్లోనూ అవకాశాలు దక్కించుకుంది. తెలుగులో నవీన్ చంద్రతో కలిసి ఐశ్వర్య లక్ష్మి నటించిన `అమ్ము` సినిమా చాలా మందిని ఆకట్టుతుంది. అంతకన్నా ముందు తెలుగులో `గాడ్సే` మూవీలో ఐశ్వర్య లక్ష్మి నటించింది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ కు జోడిగా `సంబరాల ఏటి గట్టు` అనే చిత్రం చేస్తోంది.

కానీ ఆ తర్వాతే అసలు విషయం అర్థమైంది. నిజానికి రీసెంట్ గా తమిళంలో ఐశ్వర్య లక్ష్మి నటించిన `మామన్` సినిమా విడుదలైంది. సూరి ఇందులో హీరో. ఈ సినిమాలోని ఫోటోలనే ఐశ్వర్య లక్ష్మి ఇన్స్టాగ్రామ్ లో పంచుకుంది. ఏదేమైన ఐశ్వర్య లక్ష్మి బేబీ బంప్ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాను ఓ రేంజ్లో షేక్ చేస్తున్నాయి.