ఇక అన్ని ఏరియాల్లోనూ బ్రేక ఈవెన్ దాటేసి లాభాల భాట పట్టేసిన మహర్షి కొన్ని చోట్ల మాత్రం నిరాశజనక కలెక్షన్స్ రాబడుతోంది. ముఖ్యంగా రెండు చోట్ల ఈ సినిమాకు భారీ నష్టాలు తప్పేలా లేవు. మహర్షి కోస్తాతో పాటు పొరుగు రాష్ట్రాలు అయిన తమిళనాడు, కర్ణాటకలోనూ దూసుకుపోతోంది. అయితే ఇందుకు భిన్నంగా సీడెడ్ ఏరియాలోనూ.. ఓవర్సీస్ లోనూ మహర్షి భారీ నష్టాల దిశగా పయనిస్తోంది. సీడెడ్ ఎలాగూ మహేష్కు పెద్దగా పట్టు ఉండదు. మహేష్ కంచుకోట అయిన ఓవర్సీస్లోనూ పరిస్థితి అనుకూలంగా లేకపోవడం విచిత్రమే.
సీడెడ్ విషయమే తీసుకుంటే.. బ్రేక్ ఈవెన్ మార్క్ చేరడానికి రూ. 12 కోట్ల షేర్ వసూలు చేయాలి. ఇక్కడ మొదటి వారంలో రూ. 6.86 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. రెండో వారంలో ఈ స్పీడ్ కొనసాగే పరిస్థితి లేదు. వీకెండ్ మినహా మిగిలిన రోజుల్లో సీడెడ్లో అదనపు థియేటర్లు ఖాళీగా ఉండడంతో షేర్ హరించుకుపోయింది. ఇక్కడ లాంగ్ రన్లో మహా అయితే రూ.8 కోట్లు మాత్రమే అంటున్నారు.
ఇక ఓవర్సీస్లో బ్రేక్ ఈవెన్కు రూ.13 కోట్లు షేర్ రావాలి. అంటే 3.5 మిలియన్ డాలర్లు. ఇప్పటి వరకు అక్కడ కేవలం 1.6 మిలియన్ డాలర్లు మాత్రమే వచ్చాయి. అక్కడ లాంగ్ రన్లో 2.5 మిలియన్ డాలర్లు మాత్రమే కొల్లగొడుతుందంటున్నారు. ఈ లెక్కన చూస్తే సీడెడ్, ఓవర్సీస్లో మాత్రం మహర్షికి లాస్ తప్పేలా లేదు. ఇంత హిట్ సినిమాకు అక్కడ నష్టాలు రావడం అవమానం లాంటిదే.