ఈ మద్య టాలీవుడ్, బాలీవుడ్ లో వరుసగా బయోపిక్ సినిమాలు వస్తున్నాయి. తెలుగులో మహానటి, ఎన్టీఆర్ బయోపిక్, వైఎస్సార్ (యాత్ర)బయోపిక్ లు వచ్చాయి. ప్రస్తుతం లక్ష్మీస్ ఎన్టీఆర్ కూడా రిలీజ్ కి సిద్దంగా ఉంది. బాలీవుడ్ లో దోని, బాలీవుడ్ హీరో సంజయ్ దత్ ‘సంజు’ఇలా మరికొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ బాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. సైనా పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ ‘సాహూ’హీరోయిన్ శ్రద్ద కపూర్ ని తీసుకున్నారు.
ఈ పాత్ర లో చాలా నేచురల్ గా కనిపించడానికి శ్రద్ద కొంత కాలం పాటు పుల్లెల గోపీచంద్ వద్ద బ్యాట్మింటన్ లో శిక్షణ కూడా తీసుకుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీలుక్ ని కూడా వదిలారు. తాజాగా ఈ సినిమా లో శ్రద్దా కపూర్ నటించడం లేదని వార్తలు వస్తున్నాయి. ఇందుకు కారణం ఆమెకు డెంగీ ఫీవర్ వచ్చిందని.. అందుకే ఆమెని సినిమా నుండి తప్పించినట్లు నిర్మాణ సంస్థ టీ సిరీస్ వెల్లడించింది.
వాస్తవానికి శ్రద్దాకు గత కొంత కాలమే డెంగీ ఫీవర్ వచ్చింది..ఆమె రికవరీ కూడా అయ్యింది. ప్రస్తుతం కొన్ని సినిమా షూటింగ్స్ లో కూడా పాల్గొంటుంది. ఇటువంటి సమయంలో ఇలాంటి కారణం చెప్పి చిత్రబృందం ఆమెని తప్పించడం పలు సందేహాలకు దారి తీస్తుంది. అయితే శ్రద్దా కపూర్ ఈ బయోపిక్ నుంచి తప్పుకుందా..లేదా తప్పించారా అన్న విషయంపై బాలీవుడ్ లో చర్చలు కొనసాగుతున్నాయి.