నవరసనట తేజాన్ని ప్రేక్షకులకు అందించిన మహా నటుడు సినీ దిగ్గజం కైకాల సత్యనారాయణ ఇటీవల అనారోగ్యం పాలైన విషయం తెలిసిందే. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన హాస్పిటల్ లో ఉన్న సమయంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అండగా నిలిచిన విషయం తెలిసిందే. కాగా ఇపుడు కైకాల ఆరోగ్యం కుదుట పడింది, ప్రస్తుతం కైకాల ఆరోగ్యం మెరుగైనట్లు వైద్యులు కూడా చెబుతున్నారు. అయితే ఆరోగ్యం కుదుటపడిన వెంటనే మొదటిగా కైకాల సత్యనారాయణ సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన అనారోగ్యంతో హాస్పిటల్ లో ఉన్న సమయంలో తనకు అండగా నిలిచిన అందుకు గాను, హాస్పిటల్ లో గందర గోళ పరిస్థితుల మధ్య ఉన్న సమయంలో తనకు పర్సనల్ గా ఫోన్ చేసి మరి తన మాటలతో మనో ధైర్యాన్ని పెంచినందుకు చాలా సంతోషమని తెలిపారు.

అంతే కాకుండా అవసరమైతే ప్రభుత్వం తరపు నుండి కూడా సహాయం అందించి అండగా ఉంటామని హామీ ఇచ్చినందుకు గాను సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలుపుకున్నారు సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ. అదే విధంగా ఆయనకు సాయం అందిందని విన్నవించారు. ఇలా తమకు ఆసరాగా నిలబడి నేనున్నానంటూ భరోసా కల్పించిన అందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖను రాశారు కైకాల సత్యనారాయణ. అయితే సిఎం జగన్ ఈ లేఖకు ఏమని స్పందిస్తారో అన్నది తెలియాల్సి ఉంది.

2021 నవంబర్ నెలలో కైకాల సత్యనారాయణ అనారోగ్య సమస్యల కారణంగా తీవ్ర అస్వస్థతకు గురై హాస్పిటల్లో చేరారు. ఈ విషయం గురించి తెలుసుకున్న ఏపి సిఎం జగన్మోహన్ రెడ్డి కైకాలకు ప్రైవేట్ గా ఫోన్ చేసి మరీ ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు మెరుగైన వైద్యాన్ని అందించమని సిబ్బందికి చెప్పారు. అంతే కాకుండా కైకాలకు బరోసా కలిగేలా, ఆత్మస్థైర్యం పెరిగేలా మాట్లాడారు. కాగా ఇపుడు కైకాల ఆరోగ్యం మెరుగవడంతో తనకు సాయం అందించిన సీఎం గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఒక లేఖను రాశారు. ఇప్పుడు ఇది వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: