ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి అందరికి తెలిసిందే..భారీగా కురుస్తున్న వర్షాలకు ఎక్కడ చూసిన వరదలు కనిపిస్తున్నాయి.ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే..గోదావరి ఉగ్రప్రవాహం రాజమహేంద్రవరంలోనూ దడ పుట్టిస్తోంది. రాజమహేంద్రవరం పుష్ప ఘాట్ వద్ద సుమారు 56 అడుగులకి నీటిమట్టం చేరుకుంది.కోటిలింగాల ఘాట్ శంకర్ ఘాట్ దుర్గా ఘాట్ గణపతి ఘాట్ మార్కండేయ ఘాట్, కుమారిఘాట్ ఇస్కాన్ ఘాట్ గాయత్రి ఘాట్ విఐపి ఘాట్ అన్ని ఘాట్ లో పోలీస్ సిబ్బందిని నియమించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గోదావరి నదికి లంక భూముల్లో నివాసం ఉండి జీవనం సాగించే చాపలు వేటగాళ్లు లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలను సురక్ష ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వ అధికారులకు హెచ్చరిక జారీ చేశారు.


గోదావరి ప్రవాహం ఏ మాత్రం తగ్గే పరిస్థితి లేకపోవడం ..పైగా మరింత పెరుగుతుందన్న సూచనలతో అధికారులు అప్రమత్తమయ్యారు. కొవ్వూరు గోష్పాద క్షేత్రం లో ఆలయాలు ఇప్పటికే నీట మునిగాయి. వరద ప్రభావం పై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష సమావేశం చేస్తున్నారు జిల్లా కలెక్టర్ మాధవిలత. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజీ నీటి మట్టం 15.10 అడుగులకు చేరింది. దీంతో అధికారులు 15 లక్షల క్యూసెక్కులు నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.


వరద నీరు రహదారులపై పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు పునరావాస కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేక వరద బాధితులుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు కోనసీమలోని లంక గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. కాజ్వేలపై వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. వారం రోజులుగా ఎగువ ప్రాంతాలతో పాటు క్యాచ్ మెంట్ ఏరియాలోనూ భారీగా వర్షాలు పడుతున్నాయి. ఈ సారివరద ఏ స్థాయిలో వస్తుందో అధికారులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. అందుకే ఎలాంటి పరిస్థితి ఎదురైనా తట్టుకునేందుకు అధికారులు జాగ్రత్తలుతీసుకుంటున్నారు..లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: