జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు సోల్జర్స్ వీరమరణం పొందడం జరిగింది.గ్రామస్తుల కోసం సోల్జర్స్ ఇఫ్తార్ విందు కోసం రెడీ చేశారు. ఇఫ్తార్లో వాడే వస్తువులను జవాన్లు ట్రక్కులో ఉంచారు. అప్పుడే ఉగ్రవాదులు వారిని లక్ష్యంగా చేసుకుని జవాన్లు ప్రయాణం చేస్తున్న వ్యాన్ పై గ్రనేడ్ తో దాడి చేయడం జరిగింది. ఇంకా ఈ దాడిలో లాన్స్ నాయక్ కుల్వంత్ సింగ్ వీరమరణం పొందాడు. 1999 వ సంవత్సరంలో దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ కొడుకు ఈ కుల్వంత్ సింగ్. అప్పట్లో తన తండ్రిలాగే.. ఇప్పుడు కొడుకు కూడా అమరవీరుడయ్యాడు. తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా దేశ సేవలో యుద్ధభూమిలో వీరమరణం పొందారు. ఇక సోల్జర్ కుల్వంత్ సింగ్ మరణంతో యావత్ దేశం కళ్లు చెమ్మగిల్లాయి.ఆర్మీ టీంపై ఉగ్రవాదులు రహస్యంగా దాడి చేశారు. ముందు నుంచి దాడి చేస్తే తాము ఒక్కరు కూడా ప్రాణంతో తప్పించుకోలేమని ఉగ్రవాదులకు ఖచ్చితంగా తెలుసు. ఇండియన్ ఆర్మీ శక్తి ముందు తమ ప్రతాపం ముందు ఎందుకూ పనికిరామని కూడా వారికీ తెలుసు.. అందుకనే ఎప్పటిలా దొంగ చాటుగా ఆర్మీపై వారు దెబ్బతీశారు. ఈ దాడిలో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన కుల్వంత్ సింగ్ గారు వీరమరణం పొందారు . ఇక ఆప్ నాయకుడు రాఘవ్ చద్దా కుల్వంత్ సింగ్ ఫోటోని పోస్ట్ చేసి.. దేశభక్తి పంజాబీ రక్తంలో ఉందని ఆయన అన్నారు.


ఇక మరో కుమారుడు త్రివర్ణ పతాకం చుట్టుకుని స్వగ్రామానికి తిరిగొచ్చాడని కామెంట్ చేశారు. ఉగ్రవాదుల దొంగ దాడిలో  కుల్వంత్ సింగ్ కూడా తన తండ్రిలాగే వీర్గతి సాధించాడు.ఇక కుల్వంత్ తన తండ్రి మరణించిన 11 సంవత్సరాల తర్వాత 2010 వ సంవత్సరంలో ఇండియన్ ఆర్మీలో చేరాడు. కుల్వంత్ సింగ్ రక్తంలో దేశభక్తి నిండివుంది. తన తండ్రిలా దేశ భక్తి చేయాలని ఆయన భావించాడు. అందుకనే ఎవరు ఎంత చెప్పినా కూడా అసలు ఎవరి మాట వినకుండా ఇండియన్ ఆర్మీలో చేరాడు. ఇక లాన్స్ నాయక్ కుల్వంత్‌కు ఇద్దరు పిల్లలు. ఏడాదిన్నర కుమార్తె అలాగే మూడు నెలల కుమారుడు ఉన్నాడు. ఆయన కుటుంబం మోగాలోని చాడిక్ గ్రామంలో నివసిస్తుంది. ఇంట్లో నుంచి వెళ్లేముందు అంతా సర్దుకుంటుందని, కంగారుపడకు అని చెప్పానని ఆమె తల్లి చెప్పింది.ఇక కుల్వంత్ సింగ్ ఒక్కడే కుటుంబానికి ఆధారం. ఇప్పుడు ఉన్న ఆ ఒక్క ఆధారం ఆ కుటుంబానికి పోయిందని.. ప్రభుత్వం ఖచ్చితంగా వారికి అన్ని విధాలుగా సహాయం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: