తెలుగుదేశం పార్టీ మంత్రి ఆదినారాయణరెడ్డి కడప జిల్లాలో అరాచకం సృష్టించారు. గత ఎన్నికలలో వైసీపీ పార్టీ గుర్తుపై గెలిచి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి రాజ్యాంగానికి విరుద్ధంగా మంత్రి పదవులు అనుభవిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే.
Related image
ఇదిలా ఉంటే తాజాగా కడప జిల్లాలో కొత్తగా పెళ్లి చేసుకున్నా వధూవరులను ఆశీర్వదించేందుకు వైసీపీ పార్టీ నాయకులు ఆ శుభకార్యం జరుగుతున్న గ్రహానికి వెళుతున్న సమయంలో టిడిపి మంత్రి ఆదినారాయణరెడ్డి అనుచరులు వివాహం జరుగుతున్న గృహం దగ్గర విధ్వంసం సృష్టించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెద్దదండ్లూరు గ్రామంలో ఇటీవల  ఏపీఎస్పీ కానిస్టేబుల్ సంపత్ పెళ్లి జరిగింది.
Image result for jammalamadugu attacks adhi narayana  minister
వివాహ వేడుక మే 25న జరగ్గా.. దీనికి ఎంపీ అవినాష్ రెడ్డితోపాటు.. మరికొందరు నేతల్ని ఆహ్వానించారు. అయితే.. అవినాష్ రెడ్డి ఢిల్లీలో ఉండటంతో పెళ్లికి వెళ్లటం సాధ్యం కాలేదు. అయితే తాజాగా కొత్త దంపతులను ఆశీర్వదించేందుకు బయలుదేరారు. దీంతో ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీకి చెందిన ఎంపీ అవినాష్ రెడ్డి తమ గ్రామంలోకి వస్తే తమ అధిపత్యానికి గండి పడుతుందని భావించిన ఏపీ మంత్రి ఆది కుటుంబ సభ్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.
Image result for minister adinarayana reddy
మందీమార్బలంతో రౌడీమూకల తో మంత్రి ఆదినారాయణరెడ్డి, భార్య, కుమారుడు తో ..ఆ గ్రామంలో వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉన్న ఇళ్లపై దాడులకు తెగబడ్డారు. అయితే పోలీసులు మాత్రం ఎక్కడ కూడా మంత్రి ఆదినారాయణరెడ్డి చేస్తున్నా దాడులను ఆపేందుకు ప్రయత్నించలేదు ప్రేక్షకపాత్ర వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: