ఏపీ రాజకీయాల్లో టీడీపీ వైసీపీ శత్రుత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల తర్వాత వైసీపీ తన మార్కు విజయాలతో దూసుకుపోతుంటే.. టీడీపీ మాత్రం ఢీలా పడిపోతుంది. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా కానీ... టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వం పై ఘాటు గా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. వైసీపీ ప్రభుత్వ పెద్దలు ఈ వ్యాఖ్యలను పట్టించుకున్నా.. పట్టించుకోకపోయినా వారి వ్యాఖ్యలు మాత్రం ఆగడం లేదు. మెయిన్ స్ర్టీమ్ మీడియాలో నే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి.



ఇటీవల ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పై టీడీపీ నేతలు తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు అది జాబ్ లెస్ క్యాలెండర్ అని ఒకరు అంటుంటే నిరుద్యోగులను మభ్యపెట్టడం కోసమే... ఇలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మరొకరు అంటున్నారు. అంతే కాకుండా కొత్త జాబ్ క్యాలెండర్ ని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ర్టంలో ఉన్న నిరుద్యోగులను నిలువునా ముంచేలా ఈ జాబ్ క్యాలెండర్ ఉందని ఎద్దేవా చేస్తున్నారు.


 



అయితే తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనయుడు నారా లోకేశ్జాబ్ క్యాలెండర్ పై సోషల్ మీడియా వేధిక ట్విటర్ లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ.... అర్ధరాత్రి ఆత్మలతో మాట్లాడడం ఆపి.. మంత్రులతో మాట్లాడితే వాస్తవాలు తెలుస్తాయని సూచించారు. జాబ్ లెస్ క్యాలెండర్ కాకుండా జాబ్స్ ఉన్న క్యాలెండర్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే రాష్ర్టంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, నిరుద్యోగులను ఇంకా కష్టాల పాలు చేయొద్దని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. నెటిజన్లు ఈ వ్యాఖ్యలపై భిన్న రీతిలో స్పందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: