పాకిస్తాన్ పై యుద్ధాన్ని ప్రకటించింది ఇండియా. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ దేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో దాడులు ప్రారంభించిన ఇండియన్ ఆర్మీ... ఇప్పటివరకు 80 మంది ఉగ్రవాదులను చంపినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల పై దాడులు ఇవాళ మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగే ఛాన్సులు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు 28 మందిని చంపిన నేపథ్యంలో ప్రతికార చర్య తీసుకుంటుంది మోడీ ప్రభుత్వం.

 అయితే ఆపరేషన్ సింధూర్  కారణంగా పాకిస్తాన్ దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది. లాహోర్ అలాగే సీయోల్ కోట్ ఎయిర్పోర్టులు కూడా బంద్ చేసింది  పాకిస్తాన్. ఇస్లామాబాద్ అలాగే రావల్ పిండి లో మెడికల్ ఎమర్జెన్సీ నెలకొంది. వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేసింది పాకిస్తాన్ ప్రభుత్వం. ఇలా పాకిస్తాన్ పై ప్రతికారం తీర్చుకుంటుంది ఇండియా.

 అయితే... పాకిస్తాన్ పై దాడి చేసిన నేపథ్యంలో... ఆ దేశ ప్రధాని షరీఫ్ స్పందించారు. ఇండియాను ఎలా ఎదుర్కోవాలో తమకు బాగా తెలుసు అని ఈ సందర్భంగా పోస్ట్ పెట్టారు. కచ్చితంగా ఇండియాకు కౌంటర్ ఇస్తామని... హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ వ్యాఖ్యలపై అటు అమెరికా వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇండియా దాడి చేసిందని మీరు కూడా దాడి చేయకండి అని కోరింది. ఒకవేళ మీరు దాడులు చేస్తే... పాకిస్తాన్ సర్వనాశనం కావడం గ్యారంటీ అంటూ వార్నింగ్ ఇచ్చింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టి కి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ : వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: