"అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని అన్నట్లు ".. లక్షలకి లక్షలు జీతాలు వస్తున్న శాలరీ పడిన 10 రోజులకే మొత్తం డబ్బులు ఖర్చయిపోతూ ఉంటుంది . అందరికీ ఇలా జరుగుతుంది అని చెప్పడం లేదు.  కొంతమందికి మాత్రం ఇలానే జరుగుతూ ఉంటుంది . మూడు లక్షల శాలరీ అందుకున్నా  సరే పదో తేదీ దాటగానే అకౌంట్లో పట్టుమంటే 5000 కూడా కనిపించవు . ఈఎంఐ లు అని.. ఇంటి ఖర్చులు అని.. షాపింగులు అని.. రకరకాల ఖర్చుల పేరిట మొత్తం డబ్బులు తెలియకుండానే ఖర్చు అయిపోతూ ఉంటుంది . అయితే అలాంటి వాళ్ళు చిన్న పని చేస్తే చాలు .. వాళ్ళ ఇంట్లో డబ్బు ఎక్కువగా నిలుస్తుంది.
 

ప్రతి ఒక్కరి ఇంట్లో పూజ గది ఉంటుంది . పూజ గదిలో కచ్చితంగా వినాయకుడి పటం ఉంటుంది . అయితే వినాయకుడి పటం వద్ద ఒక పసుపు గుడ్డలో ఒక రూపాయి లేదా ఐదు రూపాయలు బిల్ల.. అందులో కొన్ని అక్షింతలు కలిపి పసుపు గుడ్డను ముడుపులా చుట్టి ఆ ముడుపు  వినాయక స్వామికి బొడ్డుకు దారంలా కడితే ఇంట్లో సిరిసంపదలు ఎప్పుడు పుష్కలంగా ఉంటాయట . ఆ ఇళ్ళు ఎప్పూడు సుఖ సంతోషాలతో ఉంటుందట. అంతేకాదు ఆ వినాయకుడు ఆశీస్సులు ఎప్పుడూ ఆ ఇంటిపై చల్లగా ఉంటాయట.



పిల్లల చదువులు.. పిల్లల ఆరోగ్యాలు .. ఎప్పుడు చక్కగా ఉంటాయట. అంతేకాదు ఇలా శాలరీ వచ్చింది వచ్చినట్లే ఖర్చు అయిపోతుంటే ఇంట్లో కొంచెం డబ్బు నిలవనిచ్చే విధంగా ఆ వినాయకుడే చేస్తాడట . మన ఇంట్లోని చాలామంది పెద్దవాళ్ళు ఇలా చెబుతూనే ఉంటారు . ఇప్పటికి చాలామంది ఇలాంటి పద్ధతిని ఫాలో అవుతూనే ఉంటారు . కానీ కొంతమంది మాత్రమే ఇదంతా మూఢనమ్మకమని కొట్టి పడేస్తూ ఉంటారు . కానీ చాలామంది మాత్రం ఇలా చేసిన తర్వాత సక్సెస్ అయ్యారు . మరెందుకు ఆలస్యం మీరు ఈ ప్రాబ్లం తో బాధపడుతూ ఉంటే చేతుల్లో డబ్బులు నిలవకపోతే ఒక్కసారి ఇలా చేసి చూడండి .. ఇక మీ ఇంట్లో డబ్బే డబ్బు..ఆ వినాయుకుడి ఆశీసులు మీ ఇంటి పై ఎప్పటికి ఉన్నటే..!

మరింత సమాచారం తెలుసుకోండి: