రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ఎప్పుడు ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన ఎన్నో అంచనాలను మధ్య గ్రౌండ్ లోకి అడుగుపెడుతూ ఉంటుంది. దానికి ప్రధాన కారణం ఇందులో స్టార్ బ్యాటర్స్... బౌలర్స్ ఉండడమే. అలాగే ఈ టీం లో అత్యంత క్రేజ్ కలిగిన కోహ్లీ ఉండడం. ఇలా భారీ అంచనాల నడుమ ఈ జట్టు గ్రౌండ్ లోకి వచ్చినప్పటికీ ఎప్పుడూ కూడా ట్రోఫీని సాధించలేదు. ఇక ఇలా బెంగుళూరు ప్రతి సీజన్ లోనూ ఫెయిల్ అవుతూ ఉండడంతో తాజాగా మాజీ భారత క్రికెటర్ అంబటి రాయుడు ఈ టీం గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

తాజాగా అంబటి రాయుడు (RCB) టీం పర్ఫామెన్స్ గురించి మాట్లాడుతూ ... కోట్ల రూపాయలు పెట్టి వెచ్చించిన ఆటగాళ్లు ఎంతో మంది (RCB) దగ్గర ఉన్నారు. కానీ వారంతా గ్రౌండ్ లో తమ పర్ఫామెన్స్ ను చూపించకుండా ... డగౌట్ లోనే ఎక్కువగా ఉంటున్నారు. ఇలా జరుగుతున్నంత కాలం ఈ జట్టు రాత మారదు. అలాగే ఆ జట్టు బౌలర్ లు కూడా అత్యధిక పరుగులను ఇస్తుంటారు. ఈ టీం కష్ట కాలంలో ఉన్న సమయంలో ఒక్క స్టార్ ఆటగాడు కూడా రాణించడం నేను చూడలేదు అని రాయుడు అన్నారు. ఇలా జరుగుతున్నంత కాలం ఎప్పటికీ కూడా (RCB) కి ట్రోఫీ రాదు అని తాజాగా అంబటి రాయుడు వ్యాఖ్యలు చేశాడు.

తాజాగా అంబటి రాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే 2024 (ఐపిఎల్) సీజన్ లో భాగంగా (RCB) జట్టు ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్ లను అడగా ... అందులో మూడింటిలో ఓడిపోయి పాయింట్ల పట్టికలో చివరి నుండి మూడవ స్థానంలో కొనసాగుతుంది. మరి ఈసారైనా ఈ జట్టు మెరుగ్గా ఫర్ఫార్మెన్స్ చేసి ట్రోఫీని గెలుస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ar