చార్మినార్ లో వ్యాపారవేత్త కిడ్నాప్ హత్య కేసు లో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది.. గంజాయి మాఫియా నే మధుసూదన్ రెడ్డి ని కిడ్నాప్ చేసి హత్య చేసినట్లుగా తేల్చారు చార్మినార్ పోలీసులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... చార్మినార్ లో టీ కొట్టు వ్యాపారం నడుపుకుంటున్న మృతుడు మధుసూదన్ రెడ్డి.. గంజాయి వ్యాపారం చేసే సంజయ్ కుమార్ తో  పరిచయం ఏర్పారచు కున్నాడు.. ఆంధ్ర నుంచి గంజాయి తెచ్చి హైదరాబాదులో విక్రయం చేస్తున్న సంజయ్ ముఠా.. మధుసూదన్ రెడ్డిని మెల్లగా గంజాయి వ్యాపారంలోకి దించింది.  

మధు సూదన్ రెడ్డి తో పాటు సంజయ్, జగన్నాథ్ తో కలిసి  గంజాయి వ్యాపారం కొనసాగించారు.  అయితే.... గత నెలలో గంజాయి తీసుకు వస్తున్న సంజయ్ అల్లున్ని పట్టుకున్నారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన పోలీసులు. ఈ నేపథ్యంలో రూ. 40 లక్షలు  వరకు మధుసూదన్ రెడ్డి దగ్గర అప్పుగా తీసుకున్నాడు సంజయ్ కుమార్‌. అయితే... తన డబ్బును తిరిగి ఇవ్వాలని సంజయ్ కుమార్‌ పై ఒత్తిడి తెచ్చాడు మధుసూదన్ రెడ్డి. దీంతో బీదర్ లో డబ్బులు ఇస్తామని చెప్పి...  కారు లో కిడ్నాప్ చేసింది సంజయ్‌ కుమార్‌ గ్యాంగ్.

పాత బస్తీ పరిసర ప్రాంతాల్లోనే మధుసూదన్ రెడ్డి ని హత్య చేసిన సంజయ్ కుమార్‌...  సంగారెడ్డి సమీపంలో మృతదేహాన్ని పూడ్చి పెట్టాడు.  ఆ తర్వాత మధుసూదన్ రెడ్డి తో పాటు జగన్నాథం ను కిడ్నాప్ చేశారంటూ మధుసూదన్ రెడ్డి భార్యకు ఫోన్ చేశాడు సంజయ్ కుమార్‌. దీంతో చార్మినార్ పోలీసులను ఆశ్రయించింది మధుసూదన్ రెడ్డి భార్య. దీంతో రంగంలోకి దిగిన చార్మినార్‌ పోలీసులు.... సంజయ్ కుమార్‌ ను అరెస్ట్‌ చేసి... అసలు విషయాన్ని బయట పెట్టించారు. ప్రస్తుతం సంజయ్‌ కుమార్‌ పోలీసుల అదుపులో ఉన్నాడు. కాగా.. ఈ ఘటన ఈనెల 19 న జరిగిన సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: