ఇటీవలి కాలంలో కొంతమంది వ్యక్తులు సరదా కోసం చేసిన పనులు ఇక ఎదుటి వ్యక్తుల ప్రాణాలమీదికి తెస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.  స్నేహితులు అందరూ కలిసి ఒక చోట మద్యం తాగిన సమయంలో చిత్ర విచిత్రంగా ప్రవర్తించడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న ఇక మద్యం తాగిన సమయంలో సరదా కోసం యువకుడి మలద్వారం లోకి ఎయిర్ పంపు పెట్టి గాలి పంపించడం ద్వారా చివరికి అతను మృత్యువాత పడిన ఘటన సంచలనంగా మారింది. ఇప్పుడు ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది.


 ఇప్పటివరకు అందరూ కలిసి ఎంతో సరదాగా గడిపారు. ఫుల్లుగా మద్యం తాగారు. కానీ ఆ తర్వాత ఒక చిత్రమైన పని చేశారు. ఏకంగా ఒక యువకుడి మలద్వారంలోకి స్టీల్ గ్లాసు చొప్పించారు మిగత స్నేహితులు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఏమనుకుంటారో అని  బాధితుడు కూడా బయటకి చెప్పలేదు. కానీ నొప్పి తీవ్రం కావడంతో చివరకు ఆస్పత్రికి వెళ్లగా డాక్టర్లు సైతం పరీక్షించి అవాక్కయ్యారు అని చెప్పాలి. ఈ దారుణ ఘటన గుజరాత్లోని సూరత్లో వెలుగుచూసింది. ఒడిశా లోని గంజాం జిల్లాలో బుడుగా బ్లాక్ బలిపాధార్ గ్రామానికి చెందిన కృష్ణా చంద్ర  గుజరాత్లోని సూరత్ కి వెళ్లి అక్కడ ఓ కంపెనీ లో పని చేస్తున్నాడు.


 ఇటీవలే  స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నాడు. అంతా కలిసి మద్యం తాగారు. మద్యం మత్తులోనే కృష్ణ చంద్ర మలద్వారంలో  స్టీల్ క్లాస్ చొప్పించారు.  అతనికి నొప్పి మొదలైంది. నొప్పి తీవ్రం కావడంతో సొంతూరికి వచ్చాడు.  ఈ క్రమంలోనే విసర్జన కాకపోవడంతో పొట్ట ఉబ్బిపోయి వెంటనే ఆసుపత్రికి వెళ్లగా పరీక్షించిన వైద్యులు అసలు విషయం తెలుసుకొని షాక్ అయ్యారు. చివరికి సర్జరీ చేసి గ్లాస్ బయటికి తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ బయటకు తీసేందుకు సుమారు 2.5 గంటల శ్రమించారు వైద్యులు.

మరింత సమాచారం తెలుసుకోండి: