ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న దారుణమైన ఘటనల గురించి తెలిసిన తరువాత ప్రతి ఒక్కరూ ఉలికిపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి  అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చిన్న చిన్న కారణాలకే దారుణంగా హత్యలకు పాల్పడుతున్న ఘటనలు భయాందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. ఇటీవల రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో కూడా ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. నాలుగు రోజుల క్రితం కనిపించకుండా పోయిన ఓ యువతి చివరికి విగతజీవిగా కనిపించింది.


 ఈ క్రమంలోనే సదరు యువతి దారుణ హత్యకు గురైంది అనే విషయం నిర్ధారణ అయింది. ఈ క్రమంలోనే ఈ హత్య యువతి ప్రియుడే చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.  ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేపడుతూ  గమనార్హం. ఈ ఘటన స్థానికులను  ఒక్కసారిగా భయాందోళనకు గురి చేసింది. రాజేంద్రనగర్లో ఇటీవలే తమ కూతురు సాయి ప్రియా కనిపించడం లేదు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. ఈ క్రమంలోనే మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.


 అయితే వనపర్తి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ పొలాల్లో అనుమానాస్పదంగా ఒక మృతదేహం లభ్యమైంది అని పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలోనే ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని తల్లిదండ్రులను పిలిపించి చూపించగా.. ఇక ఆ డెడ్ బాడీ సాయిప్రియది  అని తల్లిదండ్రులు బంధువులు నిర్ధారించారు.  అయితే సాయి ప్రియ శ్రీశైలం అనే వ్యక్తిని ప్రేమించింది. అయితే  అతనితో పెళ్లికి నిరాకరించడంతోనే  చివరికి ప్రియుడు  ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. అయితే కూతురు విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి అని చెప్పాలి.. కాగా ఈ హత్యలు శ్రీశైలం తో పాటు మరో వ్యక్తి హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: