ఈ క్రమంలోనే సదరు యువతి దారుణ హత్యకు గురైంది అనే విషయం నిర్ధారణ అయింది. ఈ క్రమంలోనే ఈ హత్య యువతి ప్రియుడే చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేపడుతూ గమనార్హం. ఈ ఘటన స్థానికులను ఒక్కసారిగా భయాందోళనకు గురి చేసింది. రాజేంద్రనగర్లో ఇటీవలే తమ కూతురు సాయి ప్రియా కనిపించడం లేదు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. ఈ క్రమంలోనే మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
అయితే వనపర్తి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ పొలాల్లో అనుమానాస్పదంగా ఒక మృతదేహం లభ్యమైంది అని పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలోనే ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని తల్లిదండ్రులను పిలిపించి చూపించగా.. ఇక ఆ డెడ్ బాడీ సాయిప్రియది అని తల్లిదండ్రులు బంధువులు నిర్ధారించారు. అయితే సాయి ప్రియ శ్రీశైలం అనే వ్యక్తిని ప్రేమించింది. అయితే అతనితో పెళ్లికి నిరాకరించడంతోనే చివరికి ప్రియుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. అయితే కూతురు విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి అని చెప్పాలి.. కాగా ఈ హత్యలు శ్రీశైలం తో పాటు మరో వ్యక్తి హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.