చదువు నేర్పించాల్సిన గురువులు ఇప్పుడు దారుణంగా తయారు అయ్యాయి..పిల్లలకు మంచి నేర్పాల్సిన వాళ్ళు పిల్లల పట్ల నీచంగా ప్రవర్తిస్తున్నారు.ఇలాంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి..తాజాగామరొ ఘటన వెలుగులోకి వచ్చింది.కాలేజీ చైర్మన్ కీచక పర్వం బయటపడింది.విద్యార్థుల పట్ల అతని ప్రవర్తన అందరినీ ఆగ్రహానికి గురి చేసింది..అతని పై అందరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ ఘటన తమిళనాడులో వెలుగు చూసింది.తమిళనాడులోని విరుదునగర్ జిల్లా అరుప్పుకొట్టైలో ఓ ప్రైవేట్ నర్సింగ్ కాలేజీ ఉంది. ఆ కాలేజీ లో 500 మందికి పైగా విద్యార్థినిలు నర్సింగ్ విద్యనభ్యసిస్తున్నారు.


ఈ క్రమంలో కాలేజీ చైర్మన్ జూన్ క్రేస్.. తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని విద్యార్థినులను లోబరుచుకునే ప్రయత్నం చేశాడు. కొంతమంది యువతుల ను ట్రాప్ చేసి వారితో నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడాడు. మరికొందరు విద్యార్థినులను కూడా తనతో న్యూడ్ కాల్స్ మాట్లాడాలంటూ బెదిరింపుల కు దిగాడు. ఈ క్రమంలో జూన్ క్రేస్, విద్యార్థినులకు సంబంధించిన వీడియో కాల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి..


నగ్నంగా వీడియో కాల్‌లో మాట్లాడాలంటూ తన కాలేజీలో చదువుతున్న విద్యార్థినులను బెదిరించాడు. అయితే, కాలేజీ చైర్మన్, విద్యార్థినిల కు సంబంధించిన వీడియో లో సోషల్ మీడియాలో వైరల్ అవడం తో ఆయనగారి బాగోతం బట్టబయలైంది. కాగా, కాలేజీ చైర్మన్ నిర్వాకంపై విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజీ ముందు ధర్నాకు దిగారు. కీచక చైర్మన్‌ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాలేజీ విద్యార్థినులు ఆందోళనలు చేపట్టారు. చైర్మన్ నిర్వాకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. కాలేజీ చైర్మన్ జూన్ క్రేస్‌ ను అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు... ఇలాంటి వాడిని ఊరికే వదిలి పెట్ట కూడదని కొందరు డిమాండ్ చెస్తున్నారు. అతని దగ్గర ఫోన్ ను సీజ్  చేశారు..పూర్తీ వివరాలు తెలియాల్సి ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: