నేటి రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోయింది. ఇక మనిషి జీవనశైలిలో కూడా ఎంతగానో మార్పు వచ్చింది. ఇలా వచ్చిన మార్పుకు అనుగుణంగానే  మనిషి తన అలవాటు కూడా మార్చుకుంటున్నాడు.  అంతా బాగానే ఉంది కానీ ఎందుకు మనిషిలో విచక్షణ జ్ఞానం మాత్రం రోజురోజుకు తగ్గిపోతుందేమో  అన్న విధంగా పరిస్థితులు మారిపోయాయి అని చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు ఎలాంటి విషయంలో అయినా విచక్షణతో ఆలోచించి మనుషిలా ప్రవర్తించేవాడు మనిషి.


 ఇటీవల కాలంలో మాత్రం ప్రతి విషయంలో కూడా తాను మనిషిని అన్న విషయాన్ని మరిచిపోయి దారుణంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పాలి. ఇక నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు ఈ విషయాన్ని చెప్పకనే చెబుతూ ఉన్నాయి. ఏకంగా పరాయి వాళ్ళ విషయంలోనే కాదు సొంత వారి విషయంలో కూడా కనీస విచక్షణ లేకుండా మనిషి దారుణంగా ప్రవర్తిస్తున్న ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే.


 సాధారణంగా మహిళలు తమ భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ భార్య మాత్రం ఒక చిన్న కారణానికి భర్తను దారుణంగా చంపేసింది. చెవి దుద్దులు కొనివ్వడం లేదని భర్తకు భార్య నిప్పంటించిన ఘటన ఖమ్మంలో వెలుగు చూసింది. గాయపడిన అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు అని చెప్పాలి. నిజాంపేటలో నివసించే షేక్ యాకూబ్ పాషా, సమీనా దంపతులు కూలి పనులు చేసుకుని జీవిస్తున్నారు. అయితే తనకు చెవి దిద్దులు కొనివ్వాలని సమీనా భర్తతో తరచు గొడవ పడుతూ ఉండేది. ఇదే విషయంపై ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. ఈ క్రమంలోనే చెవి దుద్దులు ఇప్పట్లో కొనివ్వలేనని భర్త పాషా చెప్పడంతో కోపంతో ఊగిపోయిన.. భార్య చివరికి ఏకంగా రసాయనాన్ని అతనిపై చల్లి నిప్పంటించింది. స్థానికులు గమనించి అతన్ని కాపాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: