చింత చెట్టుకు ఇండియాలో మంచి ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా ఈ దేశపు ఖర్జూరపు చెట్టుగా కూడా వీరిని పిలుస్తూ ఉంటారు.. గతంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ లో కొంతమంది ప్రొఫెసర్లు చింత గింజల పైన పలు రకాల పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలో ఎల్సివియర్ జర్నల్, వైరాలజీలో ప్రచురించబడ్డాయి.. దీని ప్రకారమే మధుమేహ నిర్వహణలో ఈ చింత గింజలు చాలా ఉపయోగపడతాయని తెలియజేశారు. కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడేవారు ఈ చింత గింజలను దివ్య ఔషధంగా ఉపయోగించుకోవచ్చని వైద్య నిపుణులు సైతం తెలియజేస్తున్నారు.


ముఖ్యంగా చింతపండు గింజలలో ఎక్కువగా ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు ఎక్కువగా ఉంటాయి.. దీంతో చింతపండు గింజల నీటిని తాగడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా తగ్గించవచ్చు.


చింతపండు గింజల రసం అజీర్నాన్ని కూడా నయం చేస్తుంది అలాగే పితాని సహజ నివారణ పద్ధతిగా కూడా ఉపయోగపడుతుంది.. ఇందులో ఉండే డైటరీ ఫైబర్ వల్ల కొలెస్ట్రాలను సైతం తగ్గిస్తుంది.


యాంటీ బ్యాక్టీరియా లక్షణాలలో చర్మాన్ని ఇన్ఫెక్షన్ నుంచి రక్షించుకోవడానికి అలాగే మూత్రణాల ఇన్ఫెక్షన్ నుంచి తగ్గించడానికి ఈ చింత గింజలు చాలా ఉపయోగపడతాయి.


చింతపండు గింజలలో ఎక్కువగా పొటాషియం ఉంటుంది. వీటివల్ల బిపి కూడా తగ్గిపోతుంది. దీనివల్ల గుండెకు సంబంధించిన వ్యాధులతో ఇబ్బంది పడే వరకు ఈ చింత గింజలు దివ్య ఔషధంగా ఉపయోగపడతాయి.


చింత గింజలలో ఉండేటువంటి యాంటీ వైరల్ గుణాలు వల్ల చింత గింజల పొడిని నీటిలో కలుపుకొని ఆ నీటిని గాయాల పైన పుండ్ల పైన రాసుకుంటే మంగు మచ్చలు కూడా తొలగిపోతాయి..


చింత గింజల పొడిని తయారు చేసేటప్పుడు అందులోకి కాస్త తేనె కలిపి ఏవైనా నల్ల మచ్చల మీద పట్టిస్తే మంచి ఫలితాలు అందుకుంటాయి.. చింత గింజల పొడిని రోజు ఒక టీ స్పూన్ మేరకు నీటిలో కలుపుకొని తాగడం వల్ల మోకాళ్ళ నొప్పుల సైతం దూరమవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: