ఇక ఈ సినిమా తరువాత ప్రభాస్ జిల్ దర్శకుడు రాధా కృష్ణ తో ఒక లవ్ స్టోరీ చేస్తున్నాడు. ఈ సినిమాలో పూజ హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని యూ వీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రభాస్ ఫ్రెండ్స్ వంశీ ప్రమోద్ లతో పాటు ప్రభాస్ చెల్లెలు ప్రసీద కూడా కలిసి నిర్మిస్తుంది. ఈ సినిమా దాదాపు షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ మధ్య వచ్చిన రాధే శ్యాం అనే టైటిల్, ఫస్ట్ లుక్ అభిమానులను ఎంత గానో ఆకట్టుకున్నాయి.
ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ మహా నటి ఫేమ్ నాగ్ అశ్విన్ తో సినిమా చేయబోతున్నాడు. అశ్విని దత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పడుకునే ప్రభాస్ కి ఇందులో జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటిస్తుందని సమాచారం. నిన్ను కోరి, జెంటిల్మాన్, జై లవ కుశ చిత్రాలలో నటించిన నివేధ థామస్ ఇందులో నటిచబోతుంది. ఇప్పుడు ఏకంగా ప్రభాస్ 21 మూవీ లో ఛాన్స్ వచ్చినందుకు చాలా హ్యాపీగా గా ఉందంట. ఈ సినిమా పాన్ వరల్డ్ గా తెరకెక్కబోతుంది అని సమాచారం. ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించబోతున్నాడట.