రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో ఇండియా బాక్స్ ఆఫీస్ ఇండస్ట్రీ హిట్ కొట్టి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సాధించాడు. ఆ సినిమా ఏకంగా 1800 కోట్లు పైగా కలెక్షన్స్ రాబట్టి పెద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా అన్ని ఇండస్ట్రీ ల లోను రికార్డు స్థాయిలో కలెక్షన్ లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ చిత్రానికి శోభూ యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని కలిసి ఆర్కా మీడియా బ్యానర్ పై నిర్మించారు.  తర్వాత సాహో సినిమా తీసుకొని మిక్స్డ్ టాక్ తో నే 400 కోట్లు రాబట్టాడు ప్రభాస్. ఈ చిత్రాన్ని రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ తెరకెక్కించాడు.

ఇక ఈ సినిమా తరువాత ప్రభాస్ జిల్ దర్శకుడు రాధా కృష్ణ తో ఒక లవ్ స్టోరీ చేస్తున్నాడు. ఈ సినిమాలో పూజ హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని యూ వీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రభాస్ ఫ్రెండ్స్ వంశీ ప్రమోద్ లతో పాటు ప్రభాస్ చెల్లెలు ప్రసీద కూడా కలిసి నిర్మిస్తుంది. ఈ సినిమా దాదాపు షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ మధ్య వచ్చిన రాధే శ్యాం అనే టైటిల్, ఫస్ట్ లుక్ అభిమానులను ఎంత గానో ఆకట్టుకున్నాయి.

ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ మహా నటి ఫేమ్ నాగ్ అశ్విన్ తో సినిమా చేయబోతున్నాడు. అశ్విని దత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పడుకునే ప్రభాస్ కి ఇందులో జోడిగా నటిస్తుంది. ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటిస్తుందని సమాచారం. నిన్ను కోరి, జెంటిల్మాన్, జై లవ కుశ చిత్రాలలో నటించిన నివేధ థామస్ ఇందులో  నటిచబోతుంది. ఇప్పుడు ఏకంగా ప్రభాస్ 21 మూవీ లో ఛాన్స్ వచ్చినందుకు చాలా హ్యాపీగా గా ఉందంట. ఈ సినిమా పాన్ వరల్డ్ గా తెరకెక్కబోతుంది అని సమాచారం. ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించబోతున్నాడట. 

మరింత సమాచారం తెలుసుకోండి: