వింబుల్డన్ 2021 ఉమెన్స్ సింగిల్స్ ఫైనల్స్‌లో మన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మెరిసింది. అయితే ఆమె ఒక్కతే ఈ షోకు హాజరు కాలేదు.  డ్యూక్ అండ్ డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్ కేట్ మిడిల్టన్, ప్రిన్స్ విలియం దంపతులతో కలిసి ప్రియాంక ఈ మ్యాచ్ ను వీక్షించడం విశేషం. హై నెక్, ఫుల్ స్లీవ్ వైట్ ఫ్లోరల్ డ్రెస్ ధరించిన ప్రియాంక చోప్రా తన వెంట ఓ ట్యాన్ బ్యాగ్ ను కూడా తెచ్చుకుంది. అయితే ఇప్పుడు ప్రిన్స్ దంపతులు, హాలీవుడ్ స్టార్స్ టామ్ క్రూజ్, డేమ్ మాగీ స్మిత్ లతో కలిసి ప్రియాంక చోప్రా ఈ మ్యాచ్ చూడడం విశేషంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు ఈ మ్యాచ్ లో ప్రియాంక చోప్రా కన్పించిన పిక్స్ ను తెగ వైరల్ చేసేస్తున్నారు. కాగా ప్రిన్స్ విలియం భార్య కేట్ మిడిల్టన్ ప్రియాంకకు మంచి స్నేహితురాలు.

కాగా పాప్ సింగర్ నిక్ జోనాస్ ను వివాహం చేసుకున్న ప్రియాంక క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు ఆమెను చూసి తోటి తారలు కుళ్ళుకునేలా ఎదిగిపోయింది. ఆమె సోషల్ మీడియాలో ఓ పిక్ షేర్ చేస్తే చాలు అతి తక్కువ సమయంలోనే వాటికి భారీ లైకులు, షేర్లు వచ్చి పడతాయి. ఆమె క్రేజ్ ఆ రేంజ్ లో ఉంది మరి ! కాగా ప్రస్తుతం ప్రియాంక చోప్రా కిట్టీలో పలు హాలీవుడ్ చిత్రాలున్నాయి. వాటిలో ‘సిటాడెల్’ థ్రిల్లర్ సిరీస్ షూటింగ్ దశలో ఉంది. 'టెక్స్ట్ ఫర్ యు’, ‘మ్యాట్రిక్స్ 4’ సహా అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. 'టెక్స్ట్ ఫర్ యు' 2016లో వచ్చిన జర్మన్ చిత్రం నుండి ప్రేరణ పొందింది. దీనికి జిమ్ స్ట్రౌస్ దర్శకత్వం వహించనున్నారు. ఇక మన గ్లోబల్ బ్యూటీ చివరగా "వైట్ టైగర్"తో ఇండియాలో ఉన్న ప్రేక్షకులను పలకరించింది. ఇండియాలో ఉన్న ఆమె అభిమానులు ప్రియాంక తదుపరి చిత్రం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: