ఇప్పుడు రొమాంటిక్ సీన్లలో నటించడానికి హీరో హీరోయిన్లు ఏమాత్రం మొహమాట పడట్లేదు. కానీ గతంలో రొమాంటిక్ సీన్లలో హీరోయిన్లను దగ్గరికి తీసుకునే సీన్లలో హీరోలు ఎంతో మొహమాట పడేవారు. హీరోయిన్లు కూడా చాలా తడబడేవారు. ఆ విధంగా ఓసీన్ లో నటి రాజ్యలక్ష్మి కౌగిలించుకోవడానికి ఎంతో ఇబ్బంది పడ్డాడట సురేష్. ఆయన హీరోగా నటించిన తొలి చిత్రం జగమొండి. ఈ సినిమాతో హీరోగా నిరూపించుకుని హీరోగా సెటిల్ అయ్యాడు. శోభన్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాలో సురేష్ సెకండ్ హీరోగా నటించగా ఆయనకు జోడీగా శంకరాభరణం తో మంచి గుర్తింపు దక్కించుకున్న రాజ్యలక్ష్మి నటించారు.

వీరిద్దరూ ఊటీ లో ఓ పాట చిత్రీకరణ లో పాల్గొన్నారు. సురేష్ ఫస్ట్ టైం కెమెరా ముందు నిలిచింది ఈ పాట చిత్రీకరణ లోనే. అంతకుముందు ఆయన నటన లో ఎలాంటి ప్రావీణ్యం లేదు. ఇప్పటికే శంకరాభరణం చిత్రం ద్వారా నటిగా పేరు తెచ్చుకున్న రాజ్యలక్ష్మి ఎదురుగా ఉండడంతో ఆయనకు ఏం చేయాలో అర్థం కాలేదు. సీనియర్ నటి తో కలిసి పాటలు పాడుతూ చేయడం అనగానే మొదట కొంచెం టెన్షన్ కలిగిందట. అంతేకాకుండా ఈ పాటలో ఈ ఇద్దరి మీద చిత్రీకరించిన మొదటి సీన్ లో సురేష్ పరిగెత్తుకుంటూ వచ్చి రాజ్యలక్ష్మి కౌగిలించుకోవాలి. దాంతో ఆయన లో మరింత టెన్షన్ పెరిగిపోయింది.

 టేక్ లో సురేష్ కౌగిలించుకోవడం చేయలేకపోయాడు. అయినా మూమెంట్స్ మాత్రమే చూసుకొని డైరెక్టర్ టేక్ తీసుకున్నారు. సౌండ్ స్టార్ట్ అయింది పాట వినిపిస్తుంది. ఆ పాటకు తగ్గట్టుగా పెదవులు ఆడుతున్నాయి. సురేష్ పరిగెత్తుకుంటూ వెళ్లి రాజ్యలక్ష్మి ను కౌగలించుకుపోయేముందు ఆగిపోయాడు. సురేష్ ఏమైంది అనగానే కొంత తడి నేను ఇంతవరకు ఈ అమ్మాయి మీద చేయలేదు ఆ కారణంగా కొంత ఇబ్బంది పడుతున్నాను అనేసరికి సురేష్ డైరెక్టర్ సినిమా కోసం తప్పదు అని చెప్పాడు ఈసారి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమెను లైట్ గా పట్టుకున్నాడు. సురేష్ లో ఇంకా భయం పోలేదు ఆమెను గట్టిగా కౌగలించుకోమని డైరెక్టర్ చెప్పినా వినలేదు. చివరికి ఎంతోనిబ్బంది గా ఈ సీన్ పూర్తి చేశాడట. ఇలా ఈ సందర్భంగా చాలా టెన్షన్ పడ్డారట సురేష్ 

మరింత సమాచారం తెలుసుకోండి: